వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ నివేదికపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే.రోజా కూడా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
పవన్పై పలు పంచ్లతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికుట్రలు పన్నినా ఎవ్వరూ కూడా జగన్ సర్కార్ను ఏం చేయలేరని చెప్పారు. జగన్ 100 రోజుల పాలనపై ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని... గతంలో పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చంద్రబాబు బురద జల్లించారని.. ఇప్పుడు కూడా పవన్ను వాడుకుని జగన్ సర్కార్పై లేనిపోని విమర్శలు చేయిస్తున్నారని.. ఇలా చేయడం చంద్రబాబుకే చెల్లిందని ఆమె మండిపడ్డారు.
జగన్ 100 రోజుల పాలనపై బుక్ రిలీజ్ చేసిన పవన్.. గతంలో చంద్రబాబు పాలనలో జరిగిన అవకతకవలు ఎన్నో ఉన్నాయని... వాటిపై ఎందుకు ? బుక్ రిలీజ్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ ముద్రించిన పుస్తకాన్ని జనసేన రిలీజ్ చేసిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్యాకేజీలు తీసుకుని చంద్రబాబుకు పనిచేసిన పవన్ ఇంకా అదే పని చేస్తున్నారని రోజా సంచలన ఆరోపణలు చేశారు.
పవన్ ప్యాకేజీలు తీసుకుని బాబుకు అనుకూలంగా పనిచేయడం మంచి పద్దతి కాదని.. పవన్కు ప్రజలు త్వరలోనే సరైన బుద్ధి చెపుతారని కూడా రోజా మండిపడ్డారు. జగన్ వందరోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించారని రోజా తెలిపారు. ఏదేమైనా రోజా అటు టీడీపీ, చంద్రబాబుతో పాటు ఇటు పవన్కళ్యాణ్పై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల నేతల నుంచి రోజాపై ఎలాంటి ? రియాక్షన్ ఉంటుందో ? చూడాలి.