సమాజంలో రోజురోజుకు దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక తల్లి డబ్బు కోసం తన కూతురును వేశ్యా గృహానికి అమ్మేసిన దారుణమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. లక్ష రుపాయల డబ్బు కోసం కుమార్తెను తల్లి వేశ్యా గృహానికి విక్రయించింది. ఆ అమ్మాయి ఢిల్లీ మహిళా కమిషన్ ను ఆశ్రయించటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని పోలీసులు ప్రస్తుతం షెల్టర్ హోంలో ఉంచారు. 
 
పోలీసులు ఈ కేసులో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ నెల 8 వ తేదీన తల్లి తన కూతురితో సోదరి ఇంటికి తీసుకొని వెళతానని చెప్పింది. తల్లి అబ్దుల్ అనే వ్యక్తితో లక్ష రుపాయలకు తన కూతురును విక్రయించటానికి ఒప్పందం చేసుకుంది. తల్లి తన కూతురిని నిజాముద్దీన్ లోని ఒక హోటల్ కు తీసుకెళ్లింది. తల్లి కూతురితో అక్కడకు వచ్చిన షాహిద్ అనే వ్యక్తితో వెళ్లాలని షాహిద్ సోదరి ఇంటికి తీసుకొని వెళతాడని చెప్పింది. 
 
తల్లి మాటలను నమ్మిన కూతురు షాహిద్ వెంట వెళ్లగా అతడు ఢిల్లీలోని ఐశ్వర్ కాలనీలోని తన ఇంటికి తీసుకొనివెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆ అమ్మాయికి అసలు విషయం అక్కడ ఉండే ఇతర బాలికల ద్వారా తెలిసింది. ఇతర బాలికలు చెప్పటంతో డబ్బు కోసం తన తల్లి తనను అమ్మేసిందని అర్థమైంది. ఆ నరకకూపంలో ఉండలేని ఆ అమ్మాయి అక్కడినుండి తప్పించుకుంది. 
 
బయటకు వచ్చిన తరువాత స్థానికుల సహాయంతో ఢిల్లీ మహిళా కమిషన్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసింది. ఫోన్ చేసి వారికి జరిగిన విషయాల గురించి వివరించి చెప్పింది. మహిళా కమిషన్ కు చెందిన కొందరు సభ్యులు వెంటనే ఆ అమ్మాయి ఉన్న స్థలానికి చేరుకొని బాలికను సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకొనివెళ్లి కేసు నమోదు చేశారు. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆ అమ్మాయి తల్లితో పాటు మిగతా నిందితుల్ని అరెస్ట్ చేయాలని పోలీసుల్ని కోరినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: