ఈ నెల 22న హ్యూస్టన్ లోని, భారీ స్టేడియంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి, నరేంద్ర మోదీ 'హౌడీ మోడీ' కార్యక్రమంలో ప్రసంగించనుండగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే 50వేల మందికిపైగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి పలువురు యూస్ ప్రజాప్రతినిధులతో పాటు, ట్రంప్ కూడా హాజరవుతారని ఫారిన్ మీడియా అంటున్న వేళ, అదే జరిగితే ఈ ఘటన ఒక అద్భుతమౌతుందని, చరిత్రలో నిలిచిపోతుందని యూస్ లో భారత అంబాసిడర్ హర్షవర్ధన్ ష్రింగ్లా అభివర్ణించారు.


ఇద్దరు నేతలు ఈ వేదికపై కలిస్తే మాత్రం అది చారిత్రాత్మక మేం అని అమెరికా అభివృద్ధిలో భారత్ పాత్రను అంగీకరించినట్లేనని అన్నారు. రెండు దేశాల మధ్యా, ముఖ్యంగా మోదీ, ట్రంప్ ల మధ్య స్నేహబంధం మరింతగా పెరుగుతుందని ష్రింగ్లా అభిప్రాయపడ్డారు. కాగా,22న జరిగే కార్యక్రమానికి ట్రంప్  హాజరవుతారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తాజాగా వెల్లడించింది. దీంతో ఈ సంవత్సరం ట్రంప్, మోదీ ల  మధ్య జరిగే మూడో సమావేశానికి వేదికగా హ్యూస్టన్ నిలువనుంది.


గత నెల 26న జీ7 దేశాల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానాన్ని  అందుకున్న మోదీ, ఫ్రాన్స్ కు వెళ్లగా, అక్కడ ట్రంప్ తో సమావేశమయ్యే అవకాశం లభించింది. ఇక హ్యూస్టన్ మీటింగ్ కు తొలి ఇండో-అమెరికన్ హిందూ కాంగ్రెస్ మెన్ తులసి గబ్బార్డ్, ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా 60 మంది వరకూ ప్రజా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. హ్యూస్టన్ టెక్సాన్స్ ఫుట్ బాల్ టీమ్ వాడుకునే ఎన్అర్జీ స్టేడియం మోదీ సభకు వేదిక కానుంది.


ఈ సమావేశం వల్ల, భారత్ కి ఉపయోగకరం అని మోదీ అభిప్రాయపడ్డాడు. దీని వల్ల ఒక అమెరికా-భారత్ మధ్య ఒక సత్సంభంధం ఉంటుందని యోచిస్తున్నారు. 22న జరిగే ఈ వేదిక కి చాలా మంది ప్రముఖులు హాజరౌతారని అంచనా. ఈ సమావేశం ఆహ్వానం అందుకున్న మోదీ , హ్యూస్టన్ వేదికగా ఎన్నో విషయాలపై చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: