ఇప్పుడున్న సమాజంలో పెళ్లికి,ప్రేమకు విలువలున్నాయా అంటే అనుమానంతో అవును,కాదూ అని తెలిసి తెలియని సమాధానం చెప్పవలసి వస్తుంది.ఎందుకంటే ప్రేమించి పెళ్లిచేసుకున్న,పెద్దలు కుదిర్చిన వివాహమైన కామమనే మాయలో ఎప్పుడో ఒకప్పుడు,ఎవడితో ఒకడితో ఎలాగైనా మునిగి తేలుతుంది.ఆ అక్రమ సంబంధం ఎంతవరకు దారి తీస్తుందంటే చివరికి ప్రాణాలు తీసేవరకు,పిల్లలుంటే వాళ్లు అనాధలయ్యేవరకు.క్షణికమైన మోజులో పడి ఈనాటి యువతి,యువకులు చేస్తున్న చాలా పెద్ద తప్పు ఇది.కాని చెబితే వినేలా సమాజం లేదు ఎన్ని సంఘటనలు చూస్తున్న,ఆలోచన లేక చేసిన తప్పునే మళ్లీ మళ్ళీ చేస్తున్నారు.ఇలాంటి ఘటనలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేయడాన్ని ఆ భర్త భరించలేక పోయాడు.తన స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుని కళ్లెదుటే రాసలీలలు సాగిస్తుంటే తట్టుకోలేక పోయాడు.పద్ధతి మార్చుకోమని భార్యని,ఫ్రెండ్‌ని హెచ్చరించాడు.అయినా పట్టించుకోకపోవడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని హత్యాయత్నం చేశాడు.ఈ ఘటనలో అతడి ఫ్రెండ్ తప్పించుకోగా.భార్య ప్రాణాలు కోల్పోయింది.పిల్లలూ అనాధలైయ్యారు.ఇక అసలు వివరాలేంటో కనుగొందాం..



కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన అస్మిత్ 12ఏళ్ల క్రితం స్థానిక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట.అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో ఇద్దరు పిల్లలు సంతానంగా వచ్చారట..ఇక ఆయువతి స్థానికంగా ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది.సంతోషంగా సాగిపోతున్న వారి సంసారంలోకి అస్మిత్ ఫ్రెండ్ ఆనంద్ ప్రవేశించాడు. తరుచూ వారింటికి వచ్చివెళ్తూ ఫ్రెండ్ భార్యను ముగ్గులోకి దించాడు.ధనవంతుడైన ఆనంద్ ఆమెకు ఖరీదైన కానుకలు అవసరానికి డబ్బులు ఇస్తూ,అక్రమ సంబందానికి మూహుర్తం పెట్టాడట.అలా అస్మిత్ ఆఫీసుకు వెళ్లిన వెంటనే ఇంటికి వచ్చి ఆమెతో రాసలీలల్లో మునిగి తేలేవాడట.ఎన్నాళ్లూ దాగుతుంది రంకుతనం అన్నట్లు కొద్దిరోజుల తర్వాత వారి అనైతిక బంధం గురించి అస్మిత్‌కు తెలియడంతో మంచివాడైన అతడు పద్ధతి మార్చుకోవాలని ఇద్దరినీ హెచ్చరించాడట.



అయినప్పటికీ వారి బుద్ధి మారకపోగా మరింత రెచ్చిపోయారు.అస్మిత్ ఎదుటే వారు ఫోన్లో మాట్లాడుకునేవారు.ఇలాగైతే కుదరదని అస్మిత్ ప్లాన్‌గా  బయటకు వెళ్తున్నానని భార్యకు చెప్పి,ఇంటి పరిసరాల్లోనే నిఘా పెట్టాడు.ఇంకేముంది భర్త అలా వెళ్లగానే ఆమె ప్రియుడికి ఫోన్ చేసి రప్పించుకుని రాసలీలలు సాగిస్తుండగా,సడెన్‌గా అస్మిత్ ఇంట్లోకి ప్రవేశించగా తన భార్య ఆనంద్‌తో నగ్నంగా అసభ్య రీతిలో కనిపించిందట.దీంతో కోపం పట్టలేకపోయిన అతడు కత్తితో ఇద్దరిపై దాడికి పాల్పడగా, ఆనంద్ అతడి బారి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకుని బయటకు పరుగులు పెట్టాడు.అదే ఆవేశంలో తనను దారుణంగా మోసం చేసిన భార్యను అస్మిత్ విచక్షణా రహితంగా చంపేశాక, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడట.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తివివరాలను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.ఒకరు చేసిన పనికి నలుగురి జీవితాలూ నాశనమయ్యాయని అక్కడి స్దానికులు చర్చించుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: