టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే.ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు,అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇదిలా ఉంటే,కోడెల ఆత్మహత్యకు ముందు తన సన్నిహితులతో కొన్ని విషయాలు చెప్పుకుని తీవ్రఆవేదనకు లోనయ్యారట.ఆ విషయాలు మీడియా కు చెప్పిన సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇదిలా వుంటే కోడెల కుమార్తె విజయలక్ష్మి మాట్లాడుతూ నాన్న అంటే  తమకు ప్రాణమని,తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని స్పష్టం చేశారట.



కొడుకు,కూతురు అంటూ ఆరోపణలు చేసి ఆయన్ని ఎంతక్షోభ పెట్టారో మాటల్లో చెప్పలేనని అన్నారు.మీఅందరికీ ఓ దండమని, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండని రోదిస్తూ వేడుకున్నారు.ఆయన మానసికంగా ఎంత నరకం అనుభవించారో తమకు తెలుసని,వెళ్లిపోయిన మనిషి గురించి కూడా చెడు ప్రచారం చేస్తున్నారని,కనీసం ఇప్పుడైనా ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండని భోరున రోదిస్తూ కోడెల కుమార్తె విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.ఇక ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నేపథ్యంలో నరసరావుపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించిందట....



ఎందుకంటే కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది,మంత్రి పదవులు నిర్వహించారు.కోడెల మరణంతో ఇప్పటికే,కోట సెంటర్‌లో ని ఆయన ఇంటికి అనుచరులు,అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.ఆయనకు నరసరావుపేట,చుట్టు పక్కల గ్రామాల్లో భారీ అనుచర గణం ఉంది.ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేస్తోంది.ఈ సందర్భంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 15 రోజులపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నరసరావుపేట ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు.ఏది ఏమైన ఓ నేత బలవంతంగా పిరికి వానిలా ప్రాణాలు తీసుకోవడం చాల విషాదకరమైన సంఘటనగా ప్రజలు పేర్కొంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: