సెప్టెంబరు  17 వ తేదీన  జరుపుకునే  పండుగలు మరియు జాతీయ దినాలను ఒకసారి పరిశీలిద్దాం. తెలంగాణ ప్రజలు ఈ రోజు  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతే కాకుండా ఇదే రోజు విశ్వకర్మ జయంతి కూడా. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మహిళల మైత్రీ దినోత్సవం. ఈ సందర్బంగా మహిళలోకమంతా తమ తమ మైత్రిని చాటుకోనున్నారు. ఇక సంఘటనల విషయానికి వస్తే. .ప్రధానంగా  నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు సంస్థానం 1948  వ సవంత్సరంలో  హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య 1978 లో  కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది. పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ 2008 లో థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు.



ఈ రోజు జన్మించిన వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం.. ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య. 1906 జన్మించారు. అయన 2003 లో మరణించారు. ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎమ్.ఎఫ్. హుస్సేన్ 1915 లో పుట్టారు. ఈయన  2011 మృతి చెందారు. భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి 1943 లో జన్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి 1950 లో జన్మించారు. ప్రస్తుతం ఈయన  భారతదేశ 14వ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అది కూడా వారోత్సవం తరహాలో కమలనాధులు జరుపుకుంటున్నారు. 




ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి అరుషి నిషాంక్ 1986 పుట్టారు. ఈ రోజు అసువులు బాసిన వారిని కూడా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం.. ముత్తరాజు సుబ్బారావు 1922 లో మరణించారు. ఈయన శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు. ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభ వారు ఏర్పరచిన పోటీలకు ఎంపికైంది. అయన 1888 లో జన్మించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: