కాంగ్రెస్ సంస్క్రుతి అని అంటారు కానీ అన్ని పార్టీలనూ అదే జరుగుతోంది. దేశంలో ఇపుడు పెద్ద పార్టీగా చెప్పుకుంటూ రెండవమారు కూడా అధికారంలోకి వచ్చిన బీజేపీలోనూ భిన్న భావనలు, గొడవలు, గందరగోళాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నపుడు తెలంగాణా బీజేపీ ఎపుడూ చంద్రబాబుని సపోర్ట్ చేయలేదు. ఏపీ బీజెపీపై అప్పట్లో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఓ పెద్దాయన పడగనీడ ఉండేదని, ఆ కారణంగానే ఆ పార్టీ ఏపీలో ఎదగలేకపోయిందన్న ఆగ్రహం  తెలంగాణా బీజేపీలో ఉంది. ఉమ్మడి ఏపీగా కలసి ఉన్న రోజుల్లో కూడా కోస్తా సామాజికవర్గాల ఆధిపత్యాన్ని తెలంగాణా బీజేపీ నేతలు సహించేవారు కాదు. ఇపుడు ఎటూ రెండు రాష్ట్రాలు అయ్యాయి.


అయితే ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి మాత్రం ఇప్పటికీ ఆ పడగనీడ అలాగే ఉందన్న అనుమానం తెలంగాణా బీజేపీ నాయకుల్లో ఉంది. అందుకే వారు టీడీపీ నీడను సైతం వ్యతిరేకిస్తారు. ఇపుడు ఏపీ బీజేపీ నాయకులు జగన్ని విమర్శిస్తూంటే తెలంగాణా బీజేపీ నాయకులు మాత్రం ఆయన్ని కనీసం ఏమీ అనకపోగా పాలన బాగానే ఉందని కూడా చెబుతున్నారు. . ఏపీ, తెలంగాణాల నుంచి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అందులో  ఇద్దరి మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా వారు ఇప్పటికీ టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారమూ ఉంది. అంటే అధికార బీజేపీ ద్వారా కధ నడిపించుకోవాలన్న వారి ఆలోచనలపైన మీడియా కధనాలు వెలువడ్డాయి. వీటన్నిటికీ ఒకే జవాబు అన్నట్లుగా మురళీధరరావు కుండబద్దలుకొట్టారు. ఎవరో వచ్చి చేరినంత మాత్రాన బీజేపీ డీ ఎన్ ఏ మారదని కూడా ఆయన క్లారిటీగా చెప్పేశారు.


 ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అమరావతి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండనని, మార్చాలా వద్దా అన్నది ఏపీ సర్కార్ ఇష్టమైని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. . వీరే కాకుండా మిగిలిన తెలంగాణా బీజేపీ నేతలు కూడా ఏపీ బీజెపీ  నేతల వైఖరికి భిన్నంగానే ఉంటున్నారు. బాబు బాటలో నడిస్తే మళ్ళీ బీజేపీకి భవిష్యత్తు ఉండదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కేంద్రంలోని నాయకులు  జీవీఎల్ నరసింహారావు,  సురేష్ రెడ్డి సైతం ఏపీ బీజేపీ నేతల పోకడలతో విభేదిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ పక్కన చేరి ఏదో చేయాలనుకుంటున్న వారికి, వారిని పంపించిన వారికి కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విధంగా గట్టి హెచ్చరికలనే పంపుతోందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: