గంటకు 5,555 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగల శక్తివంతమైన మరో క్షిపణి రూపుదిదుకుంది. దీనిని  గగనతలం నుంచే  గాలిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు  ప్రయోగించవచ్చు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల సహాకారంతో దీన్ని  రూపోందించారు. దీని పరిధి 70 కిలోమీటర్లు మాత్రమే.క్షిపణి లక్ష్యం దిశగా దూసుకుపోతున్న తీరును వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ సెన్సార్లు గుర్తించాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.మంగళవారం భారత  వైమానిక దళం  విజయవంతంగా పరీక్షించింది.



అస్త్ర క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 యుధ్ధ విమానాల్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మార్పులను హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేసింది. దేశీయ పరిజ్ఞానంతో రూపోందించిన  ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి అస్త్రను  డీఆర్డీవో రూపోందించిన అస్త్ర ను  సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానానికి అమర్చి గగనతలంలో ప్రయోగించినట్లు రక్షణశాఖ విడుదలచేసిన ప్రకటనలో తెలిపింది.శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయులు తీసిపోరీతిలో తమ ప్రతిభ పాటవాలను చూపించగలుగుతారని మరోసారి   రుజువైంది. ముఖ్యంగా క్షిపణులను తయారు చేయడమే కాకుండా వారిని విజయవంతంగా ప్రయోగించడంతో కూడా అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఔరా అని అనిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 




ఈ క్రమంలోనే తాజాగా  పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత శక్తివంతమైన మిసైల్ ను వియజయవంతంగా తయారు  చేయడం అభినందనీయం. దీనిని పరీక్షించిన శాస్త్రవేత్తలు కూడా అబ్బురపడ్డారు. భారత దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్  కూడా ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఈ క్రమంలో అస్త్ర పరిధి 70 కిలోమీటర్లు మేరకు నిర్వహించిన  పరీక్ష విజయవంతం అవటం పట్ల కేంద్ర మంత్రి డీఆర్డీవో ను అభినందించారు. ఈ అస్త్ర ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని  అచ్చంగా దేశీయంగా డీఆర్డీవో రూపోందించినది కావడం విశేషం. ఇందులో అత్యధిక పేలుడు స్వభావం కలిగిన 15 కిలోల మందుగుండుతో కూడిన వార్ హెడ్ ఉంటుందని నిపుణలు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: