సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో’ కు అధిపతిగా ఎస్. వెంకటేశ్వర్ నియమితులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా విధులు నిర్వహి౦చిన‌ ఎస్.వెంకటేశ్వర్ డెప్యుటేషన్ అనంతరం బదిలీ పై హైదరాబాద్ వచ్చారు. ‘రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా’ హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్ గా కూడా వ్యవహరిస్తారు. ఇదే సమయంలోకే౦ద్ర సమాచార శాఖ (తెల౦గాణ‌) అదనపు డైరెక్టర్ జనరల్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తారు.  



ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో 1989 బ్యాచ్ కి చెందిన వెంకటేశ్వర్  పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా ఈయన  కే౦ద్ర సమాచార శాఖ, తెల౦గాణ‌ అడిషనల్ డైరెక్టర్ జనరల్(రీజియన్) గా విధులను నిర్వహిస్తారు. అంతే  కాకుండా ‘రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా’ హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ‘క్షేత్ర ప్రచార విభాగం(డి.ఎఫ్.పి), దృశ్య, ప్రకటనల విభాగం (డి.ఏ.వి.పి), గేయ, నాటక విభాగాల’ను కలిపి రీజినల్ అవుట్ రీచ్ బ్యురోగా  పిలవబడుతున్న విభాగం బాధ్యతలను కూడా ఆయన‌ నిర్వహించనున్నారు.



‘కేంద్ర ప్రభుత్వ ప్రచుర‌ణల విభాగం’(డిపిడి) కూడా అడిషనల్ డైరక్టర్ జనరల్ పరిధిలో పని చేస్తుంది. ఎస్.వెంకటేశ్వర్ గత౦లో సమాచార- ప్రసార మ౦త్రిత్వ‌ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తి౦చారు. తన 30 స౦వత్సరాల సర్వీస్ కాల౦లో పత్రికా సమాచార కార్యాలయ౦, బెంగళూరు అదనపు డైరెక్టర్ జనరల్ గా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో డైరెక్టర్ గా, పత్రికా సమాచార కార్యాలయం, భువనేశ్వర్ డైరెక్టర్ గా  వివిధ హోదాల్లో ఎస్. వెంకటేశ్వర్ పని చేశారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: