కాంగ్రెస్  ఆశ అంతా గవర్నర్ మీదే ఉంది. పాత గవర్నర్ నిర్ణయాలను తప్పు పడుతూనే... కొత్త గవర్నర్ ని రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ నిర్వహించాలని అనుకుంటున్నా ప్రజా దర్భార్ ని స్వాగతించింది కాంగ్రెస్.


గవర్నర్ తమిళిసై సౌెందర రాజన్ ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కలిశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూనే... కొత్త గవర్నర్ సపోర్ట్ పై ఆశలు పెంచుకుంది కాంగ్రెస్. గతంలో ఉన్న గవర్నర్.. టీడీపీ నుంచి గెలిచిన తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని గవర్నర్ కి వివరించారు. అప్పటి నుంచి... ఫిరాయింపుల ప్రోత్సహం జరిగిందని  చెప్పుకొచ్చారు. ఈ టర్మ్ లో కూడా 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారనీ... వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టులో కేసు ఉండగా... సబితా ఇంద్రారెడ్డి తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గవర్నర్ కు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలనీ.. అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు జరపాలని కోరారు. 


సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్ తో గవర్నర్ ఆసక్తికర చర్చ  జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా మీ పని మీరు చేయండి ..రాజ్యాంగ పరిరక్షణకు సేఫ్ గార్డ్ గా నేనుంటా అని  గవర్నర్ అన్నారు. ఇక అసెంబ్లీలో భట్టి చేసిన ప్రసంగం పై కూడా గవర్నర్ కామెంట్ చేశారు. మీ ప్రసంగం బాగుంది.. అని బట్టికి కితాబిచ్చారు. గవర్నర్ ప్రజా దర్బార్ ని స్వాగతిస్తున్నామని  భట్టి అన్నారు. 
మొత్తానికి గవర్నర్ తో జరిగిన చర్చ తర్వాత.. కాంగ్రెస్ కంటున్న కలలను రాజ్ భవన్ నుంచే సాధించుకుంటే మేలు అనుకుంటోంది పార్టీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాలను ఓపిగ్గా విన్న గవర్నర్.. మౌనంగా ఉండిపోతారా.. లేక సంచలన నిర్ణయాలు తీసుకుంటారా.. అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: