టీడీపీ పార్టీ పరిస్థితి నానాటికి ఘోరంగా తయారవుతుంది. నాయకుడిగా చంద్రబాబు మీద పార్టీ నేతలకు చాలా కోపం ఉంది. తాజాగా కోడెల ఆత్మహత్య చేసుకోవటంతో అందరీ వేళ్ళు చంద్రబాబు మీదకు పోతున్నాయి. కోడెల కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ అడ్డుకోలేదని .. అందుకే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని కొంత మంది టీడీపీ శ్రేణులే అభిప్రాయపడటం గమనార్హం. అయితే టీడీపీలోకి ఎన్టీఆర్ రావాల్సిందేనని పార్టీలో కొంత మంది తిరుగుబాటు చేయబోతున్నారా అని సందేహం వస్తుంది. అయితే మరొక వర్గం ఎన్టీఆర్ ను రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఎక్కడ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పార్టీని ... కార్యకర్తలను తన చేతిలోకి తీసుకుంటాడని భయపడుతున్నారు. 2019 ఎన్నికలో టీడీపీ పార్టీ కనీ విని ఎరుగని రీతిలో ఓటమి పాలైంది.


ఎన్నికల కౌంటింగ్ ఒక్క రోజు ముందు కూడా చంద్రబాబు నూటికి వెయ్యి శాతం గెలుస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఖంగు తిన్నాడు. పలు సభల్లో కూడా ఇంత ఘోర ఓటమి రావటానికి నేనేమి తప్పు చేశానని చెప్పిన సంగతీ కూడా తెలిసిందే. ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి.


అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పై పార్టీలో ఒక వర్గానికి ఇష్టం లేదన్న సంగతీ తెలుస్తుంది. మొన్న బాలయ్య చిన్న అల్లుడు భరత్ వ్యాఖ్యలను చూస్తే అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ పై వీరికి ఎంత ఈర్ష్య ఉందో .. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ ఎంట్రీ మీద లోకేష్ స్పందించిన సంగతీ తెలిసిందే . లోకేష్ చెబుతూ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని .. ఎన్టీఆర్ కూడా రావొచ్చని ప్రత్యేకంగా వ్యక్తుల కోసం పార్టీ ఉండదని లోకేష్ సెలవిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: