పవన్ కళ్యాణ్ వైసీపీని విమర్శించే తీరు బట్టి .. జనాలు కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ మనిషేనని కొంత మందికి క్లారిటీ వచ్చింది. ఈమధ్య పవన్ వ్యాఖ్యలను చూస్తే  అది నిజమే కదా అనిపిస్తుంది. వైసీపీ 100 రోజుల పరిపాలనలో పవన్ మేధావి పెద్ద బుక్ ను ప్రచురించారు. టీడీపీ ఐదేళ్లలో నోరెత్తని ఈ మేధావి ఇప్పుడేదో రాష్ట్రంలో ఘోరం జరిగిపోతున్నట్టు పచ్చ మాటలు మాట్లాడ్తున్నారు. జగన్ వంద రోజుల పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వీటిని మెచ్చుకునే నైజం పవన్ మేధావికి లేదు. క్లీన్ పాలిటిక్స్ అంటూ అందరి మాదిరిగానే డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. రాజధాని వ్యవహారంలో అతిగా స్పదించి టీడీపీ .. నేను ఒకటేనని సిగ్నల్స్ పంపిస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు. దీనితో జనసేన ఇంకా ఘోరమైన స్థితిలోకి పోతుంది.


ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి. జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి.


అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. పవన్ కళ్యాణ్ ఎన్నికలో ఓడిపోవడానికి మరొక కారణం ..  పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్లో స్పందించడం .. అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చి రావటం .. పోవటం చేస్తుండటంతో జనాలు పూర్తిగా జనసేనను విశ్వసించే పరిస్థితి రాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: