ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అధికారం చేతిలో లేకపోయేసరికి ఆలోచనలు సరిగ్గా ఉండటం లేదు. అందుకే అధికారం పోయినప్పటి నుండి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు నెటిజన్లు. గత రెండు రోజుల నుంచి అయితే అయన డ్రామాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 


కోడెల శివ ప్రసాద్ ఇంట్లో వేధింపుల కారణంగా, సొంత పార్టీనే దూరం పెట్టడం వల్ల మానసికంగా కృంగిపోయి ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. కోడెల చనిపోవడానికి కారణం ఒకటైతే చంద్రబాబు నాయుడు సృష్టించిన కారణం మరొకటి. ఆ కారణం ఏంటంటే 'వైసీపీ ప్రభుత్వం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని' సృష్టించారు.   


దీనిపై ఆగ్రహానికి గురైన నెటిజన్లు.. నిజాన్ని తెలుసుకోండి. అనవసరంగా నిందలు వెయ్యడం కాదు అని ఒకరు కామెంట్ పెడితే మరికొందరు కామెంట్లు పెడుతూ 'ఏంటి బాబు నిజాన్ని బయట పెడితే ఆత్మహత్య చేసుకుంటారా ? అసలు వైసీపీ ప్రభుత్వం ఎం చేసింది.. అతనిపై ఏమైనా కేసులు పెట్టిందా అని ప్రశ్నించారు. నిన్నంతా నువ్వు నీ కొడుకు పోటీ పడి మరి నటించారు కాదయ్యా అని కామెంట్లు పెట్టారు నెటిజన్లు. 


అయితే తాజాగా ఓ వార్త పత్రికలో చంద్రబాబు తెలంగాణని సింగపూర్ చేస్తాడు. అతనికి వచ్చేసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వార్తపై స్పందించిన నెటిజన్లు '' ఇప్పటికే బాబోరు 'ఆంధ్ర'ని సింగపూర్ చేశాడు.. ఇప్పుడు తెలంగాణని ఆలానే చేస్తారంటానా ? అని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఇంకా ఏ రాష్ట్రానికి వొద్దు బాబు ఇంట్లో కూర్చో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ వార్త నిజామా లేదా అనేది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: