తెలుగు దేశం పార్టీ అధినేతి నారా చంద్రబాబు నాయుడు అండ్ కో శవాన్ని పక్కన పెట్టుకుని సిగ్గుఎగ్గూ లేకుండా రాజకీయాలు చేస్తున్నారని వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి  శైలజ చరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్  జగన్మోహన్ రెడ్డి  సహృదయంతో మాజీ స్పీకర్ కోడెల  శివ ప్రసాద్ అంత్య క్రియలను  ప్రభుత్వ లాంఛనాలతో  జరిపించాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కానీ  చంద్రబాబు  అండ్ కో మాత్రం సీఎం జగన్ కు  ఎక్కడ మంచి పేరు వస్తుందనే దురుద్దేశ్యంతో  శవ రాజకీయాలు చేస్తున్నారని  విమర్శించారు.



చంద్రబాబుకు మొదటి నుండి శవ రాజకీయాలు చేయడం అలవాటేనన్నారు. కోడల ఆత్మహత్యను కూడా సీఎం  జగన్ పైన, ఆయన  ప్రభుత్వం పైన రుద్దాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  గతంలో కూడా ఎన్నోసార్లు  శవ రాజకీయాల వల్ల లబ్ధి పొందాలని చూసిన సంఘటనలు అనేకం  ఉన్నాయన్నారు.  మొన్నటికి మొన్న బావమర్ది హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకొని శవ రాజకీయాన్ని చేసిన సంఘటనను తనే స్వయంగా ఒప్పుకున్నాడని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు.





చంద్రబాబుకి తన మన అనే భేదం లేకుండా శవ రాజకీయాలు చేయటంలోను,  ఇతరులపై బురద చల్లడంలో పిహెచ్ డి  చేశారని  ఆమె దుయ్యబట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే  శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు  మారారని విమర్శించారు. తండ్రులను మానసికంగా  కృంగదీస్తు వారి మరణాలకు కారణమైన చంద్రబాబు వారి పిల్లలను చేరదీసే విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు  అంతా గమనిస్తున్నారని ఇకనైనా డ్రామాలు ఆపాలని ఆమె చంద్రబాబు  సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: