వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజధాని వ్యవహారంలో చాలా అవినీతి జరిగిందని .. చాలా మంది టీడీపీ నేతలు జైలుకు పోవటం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇప్పటీకే టీడీపీలో చాలా మంది మీద కేసులు బుక్ అయినాయి. కోడెల చనిపోవడంతో ఇదంతా వైసీపీ కక్ష రాజకీయం వల్ల అని టీడీపీ ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి. ఇప్పుడు బొత్స వ్యాఖ్యలతో టీడీపీలో ఇంకా చాలా మంది జైలుకు పోవటం ఖాయమని తెలుస్తుంది. వైసీపీ మొదటి నుంచి రాజధానిలో అవినీతి జరిగిందని చెబుతుంది. ఇప్పుడు ఆ విషయంలో కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి. రాజధాని కోసం సేకరించిన నిధులను .. బయట అప్పులను బాబు గారు చివర్లో ఎన్నికల పధకాల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఓట్లను కొనుగోలు చేసేందుకు వాడినట్టు తెలుస్తుంది.


ఇన్నీ అరాచకాలు చేసిన బాబు పైకి మాత్రం చిత్త శుద్దితో రాజధానిని నిర్మిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి .. అమరావతి అంటూ ఎప్పుడు చూసిన బాబు గారు భజన చేసేవారు. ఈ భజన భరించలేక ప్రజలు బాబుగారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అమరావతి విషయంలో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడేమో చంద్రబాబు నేను ఆదాయాన్ని సృష్టించే రాజధానిని నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని తెగ భాద పడిపోయారు.


నిజానికి అమరావతి వల్ల ఆదాయం చేకూరింది టీడీపీ నేతలకు మాత్రమే. అయితే బాబు ఐదేళ్లలో నోరు తెరిస్తే చాలు అమరావతి .. అమరావతి ఎంత హడావుడి .. కానీ చివరికి రాజధానిలో కనీసం శాశ్వత ప్రభుత్వ భవనాలు కూడా లేని పరిస్థితి. చివరికి రాజధాని ప్రాంతంలో కూడా బాబు గారి పార్టీ గెలవకుండా పోయిన పరిస్థితి. లేనిదే ఉంది అని చెప్పడం. అబద్దాన్ని నిజం చేయడం గ్లోబల్ ప్రచారం అంటారు. ఇవన్నీ వెరసి టీడీపీ హయాంలో ప్రజలకు చంద్రబాబు మీద ఆ పార్టీ మీద చిరాకు, కసి అన్నిటినీ తెప్పించింది. అందుకే జనాలు చారిత్రత్మక తీర్పును ఇచ్చారు. టీడీపీ మారకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందని నిరూపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: