ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న జగన్.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని అవలీలగా ప్రకటించేయడం.. అమలు పరచడం.. ఈ తరంలో ఒక్క జగన్ కే చెల్లిందని చెప్పుకోవాలి. కాగా అభివృద్ధి కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్రంలోని పేద ప్రజలందరికోసం తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి ప్రారంభించినటువంటి ఆరోగ్య శ్రీ పథకంలో ఎన్నో కీలకమైన మార్పులు చేసి, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలందరికి మరింత చేరువ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లో వైద్య, ఆరోగ్య రంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన నిపుణుల కమిటీ కొన్ని కీలకమైన సూచనలను చేసింది. నిపుణుల కమిటీ దాదాపుగా సూచించిన 100 సిఫారసులలో ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం పై పూర్తిగా నిషేదించాలని తెలిపింది. అందుకుగాను వారందరికీ కూడా అధిక వేతనాలు ఇవ్వాలని తెలిపింది. కాగా వీటికి సీఎం జగన్ తక్షణమే ఆమోదం తెలిపారు. ఇకపోతే కేవలం ఇక్కడే కాకుండా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయనున్నారు. కాగా ఈ సేవలన్నీ కూడా నవంబర్ నెల నుండి ప్రారంభం కానున్నాయట.
కాగా ఆరోగ్య శ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కూడా కమిటీ తెలిపింది. కాగా వీటన్నింటికి కూడా సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు.
నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు…
మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి
ప్రతి 5వేలమందికి ఒక సబ్ సెంటర్ ఉండాలి
ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి
ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి
చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి
రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు. వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి
యూత్ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి
సబ్సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది
ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి
ప్రతి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి
ఒక కౌన్సెలర్ లేదా సోషల్ వర్కర్ ఉండాలి
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలిప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి
2 బెడ్ ఐసీయూ సదుపాయం ఉండాలి
ఏది ఏమైనా జగన్ ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలతో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.