గ్రామ/వార్డ్ సచివాలయ ఫలితాల కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటీకే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో రెండు రకాల జాబులకు సంబంధించి పెండింగ్ ఉంది. వాటి గురించి సంభందిత శాఖలు ఈ రోజు ఉదయాన లోపల సమాచారాన్ని పంపిస్తే .. ఈ రోజు సాయంత్రం జగన్ చేతుల మీదుగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే రేపు ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభించడానికి ఆ జిల్లాల కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొంత మంది అభ్యర్థులు రాజకీయ నేతల చుట్టూ తిరుగుతూ రికమండ్ చేయమని చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది.


ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. జగన్ ఇప్పటికే సచివాలయాల ఉద్యోగాల్లో మంత్రుల జోక్యాన్ని, అవినీతిని సహించనని చెప్పుకొచ్చారు. దీనితో మంత్రులు కూడా ఎవరికీ హామీ ఇవ్వలేని పరిస్థితి. దళారులకు కూడా పరిస్థితి అర్ధం అయ్యి మా వల్ల కాదని అందరికీ చెబుతున్నారు. ఇదంతా జగన్ మార్క్ పరిపాలన అని వేరే చెప్పాల్సిన పని లేదు. గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి.


కానీ జగన్ మాత్రం మంత్రులకు ఇవ్వాల్సిన వార్నింగ్స్ ముందుగానే ఇచ్చారు. అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు. తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. జగన్ .. ప్రభుత్వ కొలువుల్లో రాజకీయజోక్యాన్ని అసలు సహించనని .. అలా చేస్తే సిస్టమే చెడిపోతుందని .. ఈ వ్యవస్థను కాపాడటానికి ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని మంత్రులకు జగన్ క్లాస్ పీకారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: