చంద్రబాబు గత ఐదేళ్లలో తానేదో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నానని ఉదయాన లేసిన నుంచి మీడియాలో ఎప్పుడు అమరావతి .. అమరావతి అంటూ తెగ హడావిడి చేశారు. కానీ ప్రజలు అంత అమాయకులు ఏమి కాదు కదా ! చంద్రబాబు చూపిస్తున్న గ్రాఫిక్స్ బొమ్మలును బాగా అర్ధం చేసుకున్నారు. చంద్రబాబు చేస్తున్న హడావిడీ .. పబ్లిసిటీ ప్రజలకు విరక్తి వచ్చింది. ఆ దెబ్బే టీడీపీకి ఎన్నికల్లో ఘోర ఓటమి. చంద్రబాబు ఉన్నది లేనిది చూపించాలని అనుకున్నారు. ప్రజలేంటో బాబుకు అర్ధం అయ్యే విధంగా చూపించారు. అయితే ఇప్పుడు అమరావతి హై కోర్ట్ లోకి నీరు రావటంతో బాబు గారి ప్రపంచస్థాయి రాజధాని ఇదేనా అన్న సందేహాలు వస్తున్నాయి. రాజధాని విషయంలో అడుగడుగునా అవినీతి జరిగిందని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. 


రాజధాని కోసం సేకరించిన నిధులను .. బయట అప్పులను బాబు గారు చివర్లో ఎన్నికల పధకాల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఓట్లను కొనుగోలు చేసేందుకు వాడినట్టు తెలుస్తుంది. ఇన్నీ అరాచకాలు చేసిన బాబు పైకి మాత్రం చిత్త శుద్దితో రాజధానిని నిర్మిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి .. అమరావతి అంటూ ఎప్పుడు చూసిన బాబు గారు భజన చేసేవారు. ఈ భజన భరించలేక ప్రజలు బాబుగారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అమరావతి విషయంలో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడేమో చంద్రబాబు నేను ఆదాయాన్ని సృష్టించే రాజధానిని నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని తెగ భాద పడిపోయారు.


నిజానికి అమరావతి వల్ల ఆదాయం చేకూరింది టీడీపీ నేతలకు మాత్రమే. అయితే బాబు ఐదేళ్లలో నోరు తెరిస్తే చాలు అమరావతి .. అమరావతి ఎంత హడావుడి .. కానీ చివరికి రాజధానిలో కనీసం శాశ్వత ప్రభుత్వ భవనాలు కూడా లేని పరిస్థితి. చివరికి రాజధాని ప్రాంతంలో కూడా బాబు గారి పార్టీ గెలవకుండా పోయిన పరిస్థితి. లేనిదే ఉంది అని చెప్పడం. అబద్దాన్ని నిజం చేయడం గ్లోబల్ ప్రచారం అంటారు. ఇవన్నీ వెరసి టీడీపీ హయాంలో ప్రజలకు చంద్రబాబు మీద ఆ పార్టీ మీద చిరాకు, కసి అన్నిటినీ తెప్పించింది. అందుకే జనాలు చారిత్రత్మక తీర్పును ఇచ్చారు. టీడీపీ మారకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందని నిరూపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: