రాష్ట్రంలో సుమారుగా లక్షా 26 వేల ఉద్యోగాలకు సంభందించి ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని లక్షల ఉద్యోగులు రాష్ట్ర చర్రిత్రలో మొదటిసారి అని చెప్పాలి. దేశంలోనే చాలా అరుదుగా ఇన్ని లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. గతం ప్రభుత్వంలోనే తీసుకుంటే భర్తీ చేసిన అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు తిప్పి, తిప్పి కొడితే కనీసం మూడు వేలు కూడా దాటని పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఫలితాలు విడుదల కాబోతున్నాయి.  అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభించడానికి ఆ జిల్లాల కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేశారు.


జిల్లా ఇంచార్జీ మంత్రులు ఆయా మండలంలోని ఎదో ఒక సచివాలయం ప్రారంభంలో పాల్గొంటారు. అయితే ఇంకా కొంత మంది అభ్యర్థులు రాజకీయ నేతల చుట్టూ తిరుగుతూ రికమండ్ చేయమని చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. జగన్ ఇప్పటికే సచివాలయాల ఉద్యోగాల్లో మంత్రుల జోక్యాన్ని, అవినీతిని సహించనని చెప్పుకొచ్చారు. దీనితో మంత్రులు కూడా ఎవరికీ హామీ ఇవ్వలేని పరిస్థితి. దళారులకు కూడా పరిస్థితి అర్ధం అయ్యి మా వల్ల కాదని అందరికీ చెబుతున్నారు. ఇదంతా జగన్ మార్క్ పరిపాలన అని వేరే చెప్పాల్సిన పని లేదు. గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి.


కానీ జగన్ మాత్రం మంత్రులకు ఇవ్వాల్సిన వార్నింగ్స్ ముందుగానే ఇచ్చారు. అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు. తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. జగన్ .. ప్రభుత్వ కొలువుల్లో రాజకీయజోక్యాన్ని అసలు సహించనని .. అలా చేస్తే సిస్టమే చెడిపోతుందని .. ఈ వ్యవస్థను కాపాడటానికి ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని మంత్రులకు జగన్ క్లాస్ పీకారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: