ఏపీ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తన సుపరిపాలన తో ప్రజల మన్ననలు పొందుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ సుపరిపాలన అందజేస్తున్నారు. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలను భర్తీ చేయాలని పోరాటం చేసినప్పటికీ... ఆయన ఆశయం నెరవేరలేదు. దీంతో తాము గెలిస్తే ఒకేసారి లక్షకు పైగా  ఉద్యోగాలను  భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు సీఎం జగన్. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు గ్రామ వార్డు సచివాలయం పరీక్షలు నిర్వహించింది  ప్రభుత్వం. అయితే మునుపెన్నడూ లేని విధంగా కేవలం 10 రోజుల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేసి ఒకే సారి 1, 26, 728 ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం గా  జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. అయితే అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులు... దానిని ఒక యజ్ఞంగా పూర్తి చేశారని అధికారులను అభినందించారు జగన్. కాగా  ఏకకాలంలో 1,26,728  ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి...పరీక్ష  ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయడం చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు అంటూ పలువురు జగన్ ప్రభుత్వం పై కొనియాడుతున్నారు .

 

అయితే గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన జగన్ ఫలితాల్లో  విజయం సాధించిన అభ్యర్థులు  అందరికి   అభినందనలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులకు మంచి శిక్షణ అందిస్తామని... అనంతరం అభ్యర్థులు ప్రజాసేవలో మమేకం కావాలని సూచించారు. గ్రామ సచివాలయం ద్వారా పరిపాలనలో కుల, మత, బేధం లేకుండా  రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: