తేజస్ యుద్ధ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలో చేర్చింది. ఈ విమానానికి సంబంధించిన నౌకాదళ వెర్షన్ గతవారం కీలక పరీక్ష పూర్తిచేసుకుంది. అరెస్టెడ్ ల్యాండింగ్ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా విమాన వాహక నౌకపై క్షేమంగా దిగే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఇలాంటి యుద్ధవిమానాన్ని రూపొందించే సత్తా కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది.
ఇక...తేజస్లో ప్రయాణించడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తాను స్వయంగా నడిపిన రెండు నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన తెలిపారు. చాలా స్మూత్గా...కంఫర్టబుల్గా ప్రయాణం సాగినట్లు చెప్పారు. తేజస్ ట్రిప్ను ఎంజాయ్ చేశానని అన్నారు. హెచ్ఏఎల్...డీఆర్డీఓ ఇతర ఏజెన్సీలకు రక్షణమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలకు ఫైటర్ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మొత్తానికి రక్షణ శాఖ మంత్రి తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ లో ప్రయాణించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.