బుల్లెట్​ శ్యామల అంటే పంజాగుట్ట పోలీస్టేషన్​లో పరిధిలో పోకిరీలకు, ఆకతాయిలు హడల్ పుట్టుస్తున్నారు. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న పంజాగుట్టలో శ్యామల హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు.ఆమె  పని తీరును గుర్తించిన ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓ ప్రత్యేక బృందాలలో నియమించారు. ఆ బృందంలో  ఈమెతో  పాటుగా హేమలత కూడా ఉన్నారు. ఈ బృందం  పంజాగుట్ట ఠాణా పరిధిలో ఏ మహిళకు ఎలాంటి సమస్య ఎదురైనా... మహిళ పోలీసు బృందం తక్షణమే స్పందిస్తోంది. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పంజాగుట్ట పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీరిద్దరూ.. రోజూ ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ.. స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిఘా పెడతారు. వీరిలో హెడ్ కానిస్టేబుల్ శ్యామల భిన్న రీతిలో బుల్లెట్ మోటారు సైకిల్​పై గస్తీ నిర్వహించి ఆకతాయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.



బైకు నడపడంలో ఆసక్తి ఉన్న శ్యామల.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తరహా విధులు నిర్వర్తించడం ఆనందంగా ఉందని చెబుతోంది.బుల్లెట్​పై వస్తా.. ఆకతాయిల భరతం పడతాహైదరాబాద్ మహానగరంలో మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు... ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా.. ఎక్కడో ఒక చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. రాత్రివేళల్లో బస్టాప్​లు, కాలనీలలో పోకిరీల వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందడం వల్ల.. వీటిని పూర్తిగా నివారించేదుకు పంజాగుట్ట పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఆకతాయిల భరతం పట్టడానికి ప్రత్యేకంగా మహిళా పోలీసు బృందాలను నియమించారు. ఠాణా పరిధిలో సుమారు 8 లక్షల మంది జనాభా నివాసం ఉంటున్నారు.




రద్దీ సమయాల్లో అమీర్​పేట, బేగంపేట, ఎర్రమంజిల్, బీయస్ మక్తా, ఎంఎస్ మక్తా, సోమాజిగూడ ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక గస్తీ చేయిస్తున్నారు.  ఈ క్రమంలో  ఓ రోజు  రాత్రి వేళ బస్టాప్​లో నిల్చున్న మహిళ పట్ల ఓ ఆకతాయి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ బుల్లెట్​ బండిపై అటువైపు వచ్చింది. సదరు ఆకతాయి భరతం పట్టింది. హైదరాబాద్ మహానగరంలో మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు... ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా.. ఎక్కడో ఒక చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. రాత్రివేళల్లో బస్టాప్​లు, కాలనీలలో పోకిరీల వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందడం వల్ల.. వీటిని పూర్తిగా నివారించేదుకు పంజాగుట్ట పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రద్దీగా ఉండే సమయాల్లో, రాత్రి వేళల్లో మహిళలపై వేధింపులు, వ్యభిచార ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి ఘటన జరిగినా.. వెంటనే పెట్రోలింగ్ వాహనానికి సమాచారం ఇస్తోంది.





ఠాణాకు మహిళలు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వచ్చినా.. తక్షణమే వారి సమస్య తీర్చే విధంగా శ్యామల కృషి చేస్తోంది.ఒక్క డ్యూటీనే కాదు. ఒక్క గస్తీనే కాకుండా రోడ్డుపై, కాలనీలలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు... వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తోంది. ఈ చర్యల ద్వారా అతి తక్కువ సమయంలోనే... మంచి ఫలితాలు వస్తున్నాయని పంజాగుట్ట పోలీసులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. శ్యామల కేవలం డ్యూటీనే కాకుండా వివిధ కార్యక్రమలాల్లో ఉత్సాహంగా పాల్గొంటోంది. క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం చేసే వారికి ధైర్యం చెప్పి.. జీవితం మీద ఆశ కల్పించే విధంగా కృషి చేస్తోంది. శ్యామల చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.మరిన్ని ఠాణాల్లో..ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని.. ప్రజలు కూడా అభినందిస్తున్నారని పంజాగుట్ట ఇన్​స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఉన్నతాధికారుల అనుమతితో మరింత మందిని ఉమెన్ పెట్రోలింగ్​లో భాగస్వాములను చేస్తామన్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడం వల్ల రానున్న రోజుల్లో అన్ని పోలీస్​స్టేషన్ల పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: