ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. అయన సంచలన నిర్ణయాల వల్ల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు విరాజిల్లుతున్నాయి. గతంలో ఎన్నడూ ఈ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు భరోసాగా ఉంటున్నాడు.              


ఏ ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి చెయ్యడానికి కనీసం సంవత్సరం పడుతుంది. కానీ ఈ ముఖ్యమంత్రికి కేవలం 100 రోజుల పాలనలోనే దాదాపు 50 శాతం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి సంచలనం సృష్టించాడు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. కానీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చెయ్యలేదని అది అని ఇది అని తెగ డ్రామా చేస్తున్నాడు చంద్రబాబు.                      

      

మొన్నటి వరుకు చలో ఆత్మకూరు.. నిన్నటికి నిన్న కోడెల మృతిపై శవరాజకీయం. ఈరోజు పోలవరం అంటూ డ్రామా చెయ్యడానికి ప్రెస్ ముందుకు వచ్చి హైడ్రామా చేస్తున్నాడు. పోలవరంఫై వైసీపీ ప్రభుత్వం రోజుకో మాట మారుస్తుందని.. పోలవరం పూర్తి కాలేదన్న భాద నాకు చాల ఉందని, కావాలనే పోలవరం ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారని అయన విమర్శలు చేస్తున్నారు.                                          


అయితే ఈ విమర్శలపై నెటిజన్లు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. కొంచం టైం ఇవ్వు చంద్రయ్య.. ఎందుకయ్యా అంత తొందర.. 5 ఏళ్ళ పాలనలో పూర్తయ్యింది కేవలం మూడు నెలలే.. కొద్దిగా ఓపిక పట్టండి చంద్రబాబు గారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.        


మరింత సమాచారం తెలుసుకోండి: