వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్  కష్టకాలంలో ఉన్నప్పుడు తన తన పార్టీని వీడకుండా తను వెన్నంటే ఉంటూ పోరాటం చేసిన నేతలకు జగన్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది . ఈ నేపథ్యంలోనే రోజా, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లకు కీలక పదవులు కట్టబెట్టారు జగన్. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళని కాకుండా... మొదటి నుంచి తన వెన్నంటి ఉన్న వారికి ఎక్కువ ప్రియారిటి ఇస్తున్నారు జగన్.  ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీలో కొనసాగుతూ చంద్రబాబు పై ఎన్నో ఘాటైన విమర్శలు చేసిన ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని మాత్రం జగన్  పట్టించుకోవడంలేదని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. 

 

 

 ఎప్పుడూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించే లక్ష్మీపార్వతి... ఈ మధ్య  ఎక్కడా కనిపించడం లేదు. కోడెల మరణంపై కూడా లక్ష్మీపార్వతి స్పందించకపోవడం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ లక్ష్మీపార్వతిని విస్మరించడం కారణంగానే ఆమె సైలెంట్ అయిపోయారని  గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే జగన్ తీరుపై లక్ష్మీపార్వతి అసంతృప్తి గా ఉందా.... లేక ఇంకేదైనా కారణాలవల్ల సైలెంట్ గా ఉంటున్నారా అనే విషయం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: