పవన్ కళ్యాణ్ జగన్ ను అతిగా విమర్శించడం .. చంద్రబాబు గురించి ఏం మాట్లాడకపోవటం జనాల్లో పవన్ మీద నెగటివ్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టకుండా .. ప్రతి పక్షములో ఉన్న జగన్ ను తిట్టడంతో ఎన్నికల్లో పవన్ ఘోర ఓటమిని చవిచూశారు. అయితే ఇప్పుడు కూడా పవన్ తన పంథాను మార్చుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ఓడిపోగానే .. జగన్ మీద ఎక్కడ లేని ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనితో సహజంగానే జనాల్లోకి పవన్ — బాబు ఒకటేనని ఫీలింగ్ వచ్చింది. అలా వచ్చేలా చేసింది పవన్ గారే. ఆ పార్టీకి ఏదైనా అజెండా .. వ్యూహాలు ఇవన్నీ ఉన్నాయా .. అని సందేహం రాక మానదు. వైసీపీ 100 రోజుల పరిపాలనలో పవన్ మేధావి పెద్ద బుక్ ను ప్రచురించారు. టీడీపీ ఐదేళ్లలో నోరెత్తని ఈ మేధావి ఇప్పుడేదో రాష్ట్రంలో ఘోరం జరిగిపోతున్నట్టు పచ్చ మాటలు మాట్లాడ్తున్నారు. జగన్ వంద రోజుల పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.


కానీ వీటిని మెచ్చుకునే నైజం పవన్ మేధావికి లేదు. క్లీన్ పాలిటిక్స్ అంటూ అందరి మాదిరిగానే డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. రాజధాని వ్యవహారంలో అతిగా స్పదించి టీడీపీ .. నేను ఒకటేనని సిగ్నల్స్ పంపిస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు. దీనితో జనసేన ఇంకా ఘోరమైన స్థితిలోకి పోతుంది. ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి.


జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. ఇప్పుడైనా పవన్ కేవలం జగన్ ను మాత్రమే విమర్శించకుండా .. చంద్రబాబును కూడా విమరిస్తేనే ప్రజల్లో మంచి ఫీలింగ్ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: