పసిపిల్లలకు పౌష్టికాహారం అందకపోవడంతో ఏటా లక్షలాది మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. ఇది దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతుంది. అయితే మధ్యాహ్న భోజనంను విద్యార్థులకు పెట్టకుండా తామే మింగుతున్నారు. అప్పనంగా వచ్చింది కాదా.. అంతా దోచుకుతింటే మమ్మల్ని అడిగే దిక్కేవరు అనుకున్నారో ఏమో.. ఈ పసిపిల్లల నోటికాడి ముద్దను లాక్కున్నారు. పసిపిల్లల నోటికాడి కూడును లాక్కున్న అధికారుల బండారం ఓ మీడియా ప్రతినిధి ఆధారాలతో సహా బయటికి తీయడంతో అక్రమ వ్యవహారం బట్టబయలు అయింది..
అంతే కాదు.. మధ్యాహ్న భోజనం పక్కదారి పట్టిస్తున్నారని భయటపెట్టిన జర్నలిస్టును తప్పుడు కేసులతో అరెస్ట్ చేయగా, అసలు విషయాలు వీడీయో ద్వారా తెలుసుకుని నాలుక కరుచుకున్నారు అధికారులు... ఇంతకు మధ్యాహ్న భోజనంను పక్కదారి పట్టించింది ఎక్కడో తెలుసా... బీజేపీ పరిపాలన చేస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో...పిల్లలకు మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందనే ఆశతో స్కూల్కు పంపే పేరెంట్స్ ఉన్నప్పటికీ.. అది కూడా దక్కకుండా వర్కర్లంతా కలిసి భోజనాన్ని అమ్మేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలి, కన్నవు ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
దొంగిలించిన ఆహారాన్ని రాయ్ బరేలిలోని పశువులు ఉండే చోట దాచిపెట్టారు. 9వేల 3వందల కేజీలు ఉన్న 155 సంచులను అధికారులు కనుగొన్నారు. ఈ ఘటన వెలుగు చూడడంతో 17మంది అంగన్వాడీ వర్కర్లను విధుల నుంచి తొలగించారు. 'ఇదే కాకుండా నలుగురు సూపర్ వైజర్లను, ముఖ్య అధికారులను సస్పెండ్ చేశారు' అని అధికారులు వెల్లడించారు. ఆహారాన్ని దాచి ఉంచిన గోడౌన్ ఆపరేటర్లను జైలుకు పంపారు. ఈ ఆహారాన్ని అక్రమంగా గోడౌన్ లలో ఉంచడమే కాక అనధికారికంగా అమ్ముకునేవారు.
సెప్టెంబరు మొదటి వారంలో మధ్యాహ్న భోజనంలో చపాతీలు, ఉప్పు పెడుతున్నారని వార్తలు రాసినందుకు ఉత్తరప్రదేశ్ జర్నలిస్టుని అరెస్టు చేశారు. మీర్జాపూర్లోని స్కూల్లో ఈ ఘటన జరిగింది. వీడియోతో సహా బయటపెట్టడంతో పిల్లలు రోటీ, ఉప్పు తింటూ ఉన్న విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత ఈఘటనపై ఎంక్వైరీ వేసి టీచర్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇలా పసిపిల్లల నోటికాడి కూడును లాక్కున్న వర్కర్లపై కఠిన శిక్షలు వేయాల్సిందే...