సెప్టెంబర్ 21న చరిత్రలో జరిగిన సంఘనాలు, ఈ రోజు జరుపుకునే  పండుగలు, జాతీయ దినోత్సవాలను ఒకసారి గుర్తు చేసుకుందామా.. ఈ రోజు దేశవ్యాప్తంగా బయోస్ఫియర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం సందర్బంగా పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ఈ రోజు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం. ఈ సందర్బంగా అన్ని ప్రాంతాల్లో పలు చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక చరిత్రలో ఈ రోజు చోటు చేసుకున్న సంఘటనల విషయానికి వస్తే..తెలంగాణ రచయితల సంఘం 2013 లో తన  రెండవ సదస్సును కరీంనగర్‌లో నిర్వహించింది. తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత గురజాడ అప్పారావు జననం 1862 జరిగింది. ఆయన 1915 న మరణించారు. సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు అద్దంకి శ్రీరామమూర్తి 1898 లో జన్మించారు. 1968 లో మృతి చెందారు. స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత భూపతి నారాయణమూర్తి 1921 లో పుట్టారు. 



ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు గురజాడ కృష్ణదాసు వెంకటేష్ 1927 లో జననం. ఈయన  1993 లో మరణించారు. భారతీయ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 1931 లో జన్మించారు. 1944 లో  ఎమ్వీయల్. నరసింహారావు, సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత పుట్టారు. అయన 1986  మరణించారు. ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి కెవిన్ రడ్డ్ 1957 జన్మించారు. వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కర్ట్‌లీ ఆంబ్రోస్  1963 లో జననం,  ప్రసిద్ధి పొందుతున్న సమకాలీన కవి బి.వి.వి.ప్రసాద్ 1966 లో జన్మించారు.  1979 లో  క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు, 1985 లో  క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయితలు జన్మించారు. 1991 లో నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత జన్మించారు.




మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు 1743 లో మరణించారు. అయన 1688 లో జన్మించారు. 1832 మృతి చెందిన  సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత 1771 లో పుట్టారు. 1969 లో మరణించిన  ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు మరియు భౌతిక శాస్త్రవేత్త  స్వామి జ్ఞానానంద. ప్రముఖ భారత పారిశ్రామికవేత్త రామకృష్ణ బజాబ్ 1994 లో మృతి చెందారు. 2011 లో   తుమ్మల వేణుగోపాలరావు, ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త,  వామపక్ష భావజాల సానుభూతిపరుడు  మరణించారు. ఆయన 1928 లో పుట్టారు. నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 2012 లో తనువూ చాలించారు. బాపూజీ జననం 1915 లో జన్మించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: