కొందరికి పిచ్చి ముదిరితే ఏం చేస్తారో వారికే తెలియదు.ఇప్పుడు లోకంలో కొందరి పరిస్ధితి కూడ అలాగే వుంది.ఎందుకంటే అంగట్లో సరకులు కనిపించినట్లుగా, దాచుకోవలసిన అవయవాలను అంగట్లో పెడుతున్నారు బొమ్మల రూపంలో అది ఆడవారి రహస్య ప్రదేశాన్ని.ఇదేం విడ్డూరమంటే దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది. అపార్ధం చేసుకోకండి అంటున్నారు. ఇప్పటికే హీరోయిన్స్ కాస్తో,కూస్తో తెరపై చూపిస్తేనే తట్టుకోలేని వాళ్లు ఇలా మ్యూజియంలో పెడితే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారో.ఇంతకు అసలు విషయం ఏంటంటే  2017లో ఐస్‌ల్యాండ్‌లో పురుషాంగాలపై అవగాహన కోసం ఫాలోలాజికల్ మ్యూజియాన్ని ప్రారంభించి,అందులో వివిధ జంతువుల పురుషాంగాలను కూడా ప్రదర్శనలో పెట్టారట,ఆ మ్యూజియాన్ని సందర్శించిన ఫ్లోరెన్స్ అనే ఓ పెద్దమనిషికి,ఆ రోజు నుంచి స్త్రీల మర్మాంగాలపై కూడా మ్యూజియం ప్రారంభించాలనే ఆసక్తి కలిగిందనట.



తానుకూడా అలాంటి మ్యూజియాన్ని ప్రత్యేక ఆకర్షణతో స్టార్ట్ చేయాలని అనుకుని మొత్తం 50 వేల పౌండ్లు (రూ.4,439,309) వ్యయంతో దీన్ని నిర్మించారట.ఈ నేపథ్యంలో లండన్‌లోని కామ్డెన్ మార్కెట్‌లో ప్రపంచంలోనే తొలిసారిగా వజైనా మ్యూజియం అందుబాటులోకి తెస్తున్నారు.ఈ మ్యూజియం కట్టడానికి అయిన వ్యయం మొత్తాన్ని ప్రజలే స్వయంగా విరాళాల రూపంలో అందించడం గమనార్హం.ఇక ఈ మ్యూజియం వ్యవస్థాపకులు ఫ్లోరెన్స్ షెక్టర్ మాట్లాడుతూ.స్త్రీల మర్మాంగాలపై ప్రజల్లో ఉండే అపోహలను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు.ఇక అనాదిగా మర్మాంగం అనే మాటను చాలామంది తప్పుగా భావిస్తారు.కానీ,ఆ భావం మనుగడకు మంచిది కాదని మేధావుల అభిప్రాయమని.అది కూడా శరీరంలో ఒక భాగమేనని,అత్యంత సున్నితమైన అవయవం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని చెబుతున్నారు.



ఈ మ్యూజియంలో మహిళలు ఎదుర్కొనే  సమస్యలపై ప్రధానంగా చర్చిస్తామని ఫ్లోరెన్స్ తెలిపారు.మహిళల యోనిలను కోసి హింసించడం,అత్యాచారాలు,గృహ హింసలు గురించి చర్చిస్తామన్నారు.‘చాలామంది బాలికలు,మహిళలు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు,గైనకాలజికల్ చెకప్ చేయించుకోడానికి మొహమాట పడతారు.దానివల్ల వారు గర్భాశయ క్యాన్సర్ (Cervical cancer)వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇక్కడికి వచ్చే సందర్శకులకు వాటిపై పూర్తిగా అవగాహన కల్పిస్తా మన్నారు.ఇది కేవలం మ్యూజియంగానే కాకుండా.డిస్కో పార్టీలు,కామెడీ నైట్స్,స్కూల్ టూర్స్,ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వంటి కార్యక్రమాలతో కూడా ప్రజలను ఆకట్టుకోనుందని ఫ్లోరెన్స్ తెలిపారు.స్త్రీ మర్మాంగాలకు సంబంధించిన చరిత్ర,శాస్త్రీయ అంశాలను కూడా ఇక్కడ వివరిస్తారన్నారు.ఇక ఇక్కడ లభించే తినుబండారాలు,పానీయాలు సైతం‘యోని’ని ప్రతిబింబించేలా ఉంటాయన్నారు.ఏమిటో విచిత్రం కాని పరాయి దేశంలో ఎన్ని పిచ్చి వేషాలు వేసిన చెల్లుద్ది కాని మనదేశంలో ఎన్ని అడ్దంకులు ఏర్పడుతాయో,ఎన్ని గొడవలు జరుగుతాయో అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.


మరింత సమాచారం తెలుసుకోండి: