ఇద్ద‌రు టీడీపీ మాజీ మంత్రుల‌కు వారి త‌మ్ముళ్లు షాక్ ఇవ్వ‌బోతున్నారు. వీరిలో ఒక‌రు ఇప్ప‌టికే టీడీపీకి రాజీనామా చేయ‌గా... మ‌రో మాజీ మంత్రి త‌మ్ముడు సైతం పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. వీరిలో ఇప్ప‌టికే టీడీపీని వీడిన మాజీ మంత్రి త‌మ్ముడు వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే.. త్వ‌ర‌లో టీడీపీకి గుడ్ బై చెప్ప‌బోయే మాజీ మంత్రి త‌మ్ముడు బీజేపీలోకి వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో పార్టీని వీడుతున్న‌ట్టు తెలుస్తోంది.


ఇక అన్న‌ల‌కే షాక్ ఇస్తోన్న ఆ ఇద్ద‌రు మాజీ మంత్రుల త‌మ్ముళ్లు ఎవ‌రో ?  కాదు. ఒక‌రు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు త‌మ్ముడు స‌న్యాసినాయుడు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు న‌ర్సీప‌ట్నం మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన ఆయ‌న టీడీపీకి త‌న అనుచ‌ర‌గ‌ణంతో పార్టీని వీడారు. ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేవిధంగా మ‌రో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తమ్ముడు బేబీ నాయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


ఇక స‌న్యాసిపాత్రుడికి అన్న అయ్య‌న్న‌తో గ‌త కొద్ది రోజ‌లుగా తీవ్ర‌మైన విబేధాలు ఉన్నాయి. అయ్య‌న్న త‌న‌యుడు పూర్తిగా డామినేట్ చేసి చివ‌ర‌కు మునిసిపాల్టీలో సైతం బాబాయ్‌ను డ‌మ్మీగా చేయ‌డంతో ఆయ‌న ర‌గిలిపోయి పార్టీ మారుతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో బలమైన నేతకోసం వెతుకుతున్న బీజేపీ మాజీ మంత్రి రంగారావుపై దృష్టి పెట్టింది. బొబ్బిలి రాజుల వంశానికి చెందిన సుజ‌య్ పార్టీ మారేందుకు ఆస‌క్తిగా లేక‌పోవ‌డంతో టీడీపీతో అంటీ ము ట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆయ‌న తమ్ముడు చిన్నరాజాగా పేరుగాంచిన బేబీ నాయనకు  వ‌ల‌వేసింది.


ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్ర అగ్ర‌నాయ‌క‌త్వం బీబీ నాయ‌న‌తో ప్రాథ‌మికంగా చ‌ర్చ‌లు పూర్తి చేయ‌గా.. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీని వీడే అంశంపై ఏదో ఒక డెసిష‌న్‌కు రానున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా టీడీపీకి త‌గులోత‌న్న వ‌రుస షాకుల ప‌రంప‌రంలో ఇదే షాక్ అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: