చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ అకాల మరణంతో టీడీపీ శ్రేణులు అభిమానులు అనుచరులు విషాదంలో మునిగిపోయారు. రంగస్థల నటుడిగా  ప్రస్థానం ప్రారంభించిన శివప్రసాద్ అనతికాలంలోనే వెండితెరపై వెలిగాడు. ఆ తర్వాత ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి  ఎన్నో కీలక  పదవులను  చేపట్టి ప్రజలకు సేవ చేసారు. అయితే గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా  ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలిపిన వారిలో ప్రసాద్ శివప్రసాద్  సుపరిచితులు. వివిధ వేషధారణలతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంట్ ముందు ఎన్నో రోజులు నిరసనలు వ్యక్తం చేశారు. 

 

 

 

 టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి... దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ కి చిన్నప్పట్నుంచి స్నేహబంధం ఉంది. చంద్రబాబునాయుడు శివప్రసాద్ స్కూల్లో ఓకే క్లాస్ కు చెందిన వాళ్ళట . కాగా చంద్రబాబునాయుడు పిలుపుతో పార్టీలోకి వచ్చిన శివప్రసాద్ టిడిపి పార్టీలో ఎన్నో  కీలక పదవులు చేపట్టారు. అయితే శివప్రసాద్ హఠాత్ మరణం టీడీపీకి తీరనిలోటని టిడిపి నేతలు శివ ప్రసాద్ కి సంతాపం తెలుపుతున్నారు.కాగా  టీడీపీ లో సీనియర్ నేతలైన ఏపీ మాజీ స్పీకర్ కోడెల, చిత్తూరు మాజీ ఎంపీ  శివ ప్రసాద్ లు  మృత్యువాత పడడం టిడిపికి తీరని   లోటమే  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: