ఇక ఇస్రో  తన తదుపరి లక్ష్యం గగన్‌యాన్‌. సాయుధ బలగాల్లోని టెస్ట్‌ పైలట్లను వ్యోమ గాములుగా పంపాలని ఇస్రో భావిస్తోంది. చంద్రయాన్‌ -2 ప్రయోగంలో నిరాశతో కుంగిపోకుండా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. వాస్తవానికి  విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ కోసం ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్‌ ల్యాండర్‌ గల్లంతు కాగా.. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. ఫలించలేదు. అయితే  చంద్రయాన్‌-2లోని ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు  పేర్కొంటున్నారు. విక్రమ్ ఎపిసోడ్ పై ప్రస్తుత పరిస్థితులను ఇస్రో చైర్మన్‌ శివన్‌ విధికరించారు.



భువనేశ్వర్‌ ఐఐటీలో శనివారం ఆయన మాట్లాడుతూ గగన్‌యాన్‌ మిషన్‌కు రూ.10వేల కోట్లు ఖర్చుకాగలదని ఆయన వివరించారు. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టిందన్నారు. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ మళ్లీ విక్రమ్‌ ల్యాండర్‌ కోసం వెతకనుంది. కానీ, అప్పటికీ విక్రమ్‌ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి ‘మధ్య రాత్రి’ సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలపై ఇస్రో ఆశలు నీరుగారిపోయాయి. వెంటనే తేరుకున్న ఇస్రో.. చంద్రయాన్‌-2 ప్రయో గంలో 98శాతం విజయం సాధించామని, ఇక తమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్‌ అని  ప్రకటించింది.  




ముగ్గురిని ఎంపిక చేసి తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సష్టించనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్‌ ల్యాండర్‌.. అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక మళ్ళి విక్రమ్ జాడ కోసం అన్వేషణ మొదలవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: