టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ఘోరమైన పరిస్థితిలో ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ ముఖ్యమైన నేతలను కోల్పోతుంది. మొన్న కోడెల శివప్రసాద్ రూపంలో బలమైన లీడర్ ను కోల్పోతే ఇప్పుడు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ను కోల్పోయింది. ఇలా పార్టీలోని సీనియర్ నేతలను కోల్పోవటం నిజంగా ఆ పార్టీకి చాలా బాధాకరం .. మరియు కష్టకాలం అని చెప్పాలి. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలు కూడా పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎన్నికల ముందు టీడీపీ మునిగిపోయే నావ అని కొంత మంది ముందుగానే అర్ధం చేసుకొని వైసీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీలో ఉండిపోయిన నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది.


దీనితో ఇప్పుడు ఈ నేతలు టీడీపీలో ఉండి తప్పు చేశామని ఆఫ్ ది రికార్డు చర్చించుకుంటున్నారు.  టీడీపీ పార్టీ మళ్ళీ కోలుకుంటుందని ఇప్పుడు ఏ నేత కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. మొన్న తోటా త్రిమూర్తులు వైసీపీలో చేరిన సంగతీ తెల్సిందే. ఇప్పటీకే పలువురు నేతలు టీడీపీ పార్టీకి రాజీనామా కూడా చేసిన సంగతీ తెలిసిందే.  టీడీపీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో నేతలందరికీ అర్ధం అయ్యింది. పైగా చంద్రబాబుకు వయసు కూడా అయిపోవడంతో ఆ పార్టీని వదిలిపెట్టడం మంచిదని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారందరు ఎందుకు పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే.


వైసీపీ తలుపులు తెరిస్తే చాలు ... వెంటనే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్  ఆ పని చేయడని తెలుసు కాబట్టి చంద్రబాబు నిర్భయంగా ఉన్నారు. అయితే నేతలు జంప్ అయ్యే పరిస్థితి లేకపోవటంతో రాజీనామాలు చేసి మరీ పార్టీకి దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనితో తెలంగాణ టీడీపీ మాదిరిగా ఒక్కరో .. ఇద్దరో ఎమ్మెల్యేలు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే   తూర్పు గోదావరి జిల్లా ప్రత్తి పాడు స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయిన వరుపుల రాజా గురువారం పార్టీకి రాజీనామా చేశారు. వరుపుల రాజా గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్న నేత. కానీ జగన్ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. ఇలా వరుస వలసలతో కూడా టీడీపీ దెబ్బతింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: