ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ , టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లు చూసి ఓర్వలేకపోతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బిసి సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంఎల్‌ సి శ్రీ జంగాకృష్ణమూర్తి మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జంగా మాట్లాడారు. సీఎం   వైయస్‌ జగన్‌ అభివృధ్ది, సంక్షేమం దిశగా దూసుకుపోవడం చంద్రబాబు,వేమూరి రాధాకృష్ణలకు ఇష్టం లేదన్నారు.అందుకనే అభూతకల్పనలు రాసి నిరుద్యోగులలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.



జగన్ నిర్ణయాన్ని ఏబీన్ రాధాకృష్ణ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. వేమూరు రాధాకృష్ణ కు చెందిన వ్యవహారాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. ఒకేసారి లక్షా 27 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం చారిత్రాత్మకమని చెప్పారు. ప్రజలకు మేలు చేయడం కోసం సచివాలయం ఉద్యోగాలను సీఎం భర్తీ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువ మంది అర్హత సాధించారని చెప్పారు. బీసీ నేతలను రాధాకృష్ణ బాడుగ నేతలుగా తన పేపర్, ఛానెల్ లో గతంలో అభివర్ణించారు. బీసీలను అణగదొక్కాలని ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. 




రాష్ట్రంలో చంద్రబాబు తప్ప మరొకరు సీఎం కాకూడదని రాధాకృష్ణ ఉద్దేశ్యమన్నారు. పత్రికను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు భూదండలకు పడ్డారని ఆరోపించారు.  కులాలు, మతాలు మధ్య రాధాకృష్ణ చిచ్చు పెడుతున్నారు. ఆయన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో మొదటి ర్యాంక్ వస్తే చంద్రబాబు రాధాకృష్ణ తట్టుకోలేక పోతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగుల్లో అనేక అపోహలు సృష్టించాలని రాధాకృష్ణ ,చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. చంద్రబాబు, రాధాకృష్ణ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని కృష్ణ మూర్తి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: