యువతకు ఓర్పు సహనం ఎంతో ముఖ్యమని నెహ్రు యువ కేంద్ర జాతీయ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం నెహ్రు యువకేంద్రం ,గుంటూరు, ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహణలో జాతీయ యువ సేవా కార్యకర్తల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం బాపట్ల ఎన్. జి.రంగా అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయంకు చెందిన జీడిమామిడి మొక్కల పరిశోధనా కేంద్రంలో నిర్వహించటం జరిగింది. ఈ శిక్షణ శిబిరాన్ని జాతీయ వైస్ ఛైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నెహ్రు యువ కేంద్రం ఆంధ్రప్రదేశ్ శాఖ సంపాదకులు వెంకటేశం అధ్యక్షత వహించారు ఈ కార్య క్తమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. 




నెహ్రూ యువ కేంద్ర శిక్షణా తరగతులకు హాజరైన సేవా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  కూడా ఈ శిక్షణా కేంద్రంలో పని చేసిన వారేనన్నారు. దీనిని ఆయనే స్వయంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించి శిక్షణలో 3 గంటలకు పైగా సమయం వెచ్చించారన్నారు. ఈ కార్యక్రమంలో 15 రోజుల తరగతులు తీసుకున్నవారు తప్పక వారికి కేటాయించిన పనులను తప్పక చేయాలన్నారు. అంతేకాకుండా  సేవాగుణం కలిగివుండాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ శాఖకు ఏటా 150 కోట్లు వేచ్చిస్తుందని ఈ సొమ్ము వృధా కాకుండా చూడవలసిన బాధ్యత పౌవురులుగా  మన అందరిపై వున్నదని అన్నారు. అంతే కాకుండా మోడీ  ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు  ఆయనలో సేవాగుణం, ఓర్పు, సహనం, నిజాయితీ, నిబద్ధతతో ముందుకు పోతున్నారని చెప్పారు.




కాబట్టి ఈరోజు ప్రపంచంలో అగ్రదేశం అయిన అమెరికా రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికని విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.  దేశంలో  ఏ ప్రధానికి దక్కని గౌరవం దక్కింది మోడీకే అని విష్ణు కొనియాడారు. పాత్రికేయులకు సూచన చేస్తూ శిక్షణా తరగతులు పూర్తి అయ్యాక వారి అభిప్రాయాలు ప్రజల్లోకి తెసుకెళ్లే  బాధ్యత మీపై ఉందని గుర్తు చేశారు. ఆయనతో పాటు మానవ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ చక్రపాణి, ఆర్ టిడి ఐఆర్ ఎస్ హరిప్రసాద్, నాగసాయి, రవి శంకర్, డైరెక్టర్ కిరణ్మయి, యశస్వి, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కమిటీ డైరెక్టర్ వీరమాచినేని చైతన్య తదితరులు పాల్గోన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: