నిన్న డాటర్స్ డే సందర్భంగా దేశం మొత్తం డాటర్స్ డేను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఎంతోమంది ప్రముఖులు సోషల్ మీడియాలో తమ కుమార్తెలతో ఉన్న తీపి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురితో తాను దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి "నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నువ్వు ఎప్పుడూ ఇలా ప్రకాశవంతంగా ఉంటావు" అని ట్వీట్ చేశారు. 
 
మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా కూతురు అర్హా చెప్పే డైలాగులను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కూతురు చెప్పిన మాటలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తండ్రులకు ప్రపంచంలో క్యూట్ గా కనిపించే వాళ్లు కూతుళ్లే. ప్రపంచంలోని కూతుళ్లందరికీ హ్యాపీ డాటర్స్ డే అని చెప్పారు. కానీ మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో మాత్రం డాటర్స్ డే రోజున దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 
 
తల్లి తన నలుగురు కూతుళ్లతో కలిసి బావిలో దూకి శవాలుగా మిగిలారు. ఈరోజు ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఈ విషయం తెలియటంతో ఘటనాస్థలానికి చేరుకొని బావి నుండి మృతదేహాలను బయటకు తీశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఐదుగురిని ఎవరైనా చంపి బావిలో పడేశారా ?  ఏవైనా కారణాల వలన వీరే ఆత్మహత్య చేసుకున్నారా ? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
డాటర్స్ డే నాడు ఇలాంటి ఘటన జరగటం అక్కడి స్థానికుల్ని కలిచివేసింది. ఈ ఐదుగురికి చనిపోయేంత కష్టం ఏమి వచ్చిందో అని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ పూర్తయిన తరువాత మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా కావాలని చంపేశారా అనే విషయాల గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: