ఇంతకీ ఏ జరిగిందంటే ఎస్వీ యూనివర్సిటీ కి సాంకేతిక సహాయం అందిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ కు ఆ వికలాంగుడు ప్రతినిధి గా వ్యవహరిస్తున్నాడు. అయితే యూనివర్సిటీ సంస్థ కు బకాయి పడింది. దాంతో పెండింగ్ బిల్లులకోసం ఆప్రతినిధి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్ళాడు. అయితే అక్కడేవున్న సిబ్బంది 30నిమిషాలు అతన్ని ఆ గదిలో నిర్బదించి అతనిపై మాటలదాడికి దిగారు. ఆ వికలాంగుడు బయటకు రావాలని ప్రయత్నించినా సిబ్బంది అతన్ని బయటకు రానీయకుండా చేశారు. అంతేకాకుండా బలవంతంగా అతని దగ్గరి నుండి సంతకాలు కూడా సేకరించారు.ఈతతంగం అంతా ఇంచార్జ్ రిజిస్ట్రార్ ముందే జరిగింది.
దాంతో ఈఘటనలో రిజిస్ట్రార్ పాత్ర ఉందని అనేక అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఘటన జరిగి 10రోజులు అవుతున్న యూనిర్సిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ తన తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తుండడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. మరి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ వికలాంగుడికి న్యాయం చేస్తుందో లేదో చూడాలి.