అధికారం చేతులో ఉంటే ఏమైనా చేయ్యెచ్చ‌న్న‌మాట‌.. ఇది అక్ష‌రాల రుజువు చేసారు బాబోరు.. అయ్య బాబోయ్‌.. చంద్రాలు చేసిన చేస్తున్న ప‌నులు చూస్తుంటే అస‌లు అక్ర‌మాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అంటూ ఏదైనా ఉందా అంటే అది చంద్రాలు అడ్ర‌స్సే అయి ఉంటుందని ఏపీ ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.. ఇంత‌కు ఏమీ జ‌రిగింది.. చంద్రాలుపై అట్లా దుమ్మెత్తిపోస్తున్నారేందీ అనుకుంటున్నారా... ఏమీ లేదండి.. బాబోరు య‌వ్వారం చూస్తుంటే.. దొంగే దొంగ అని అరిచిన సామేత గుర్తుకొస్తుంది.. ఇంత‌కు ఏందీ సంగ‌తీ అనుకుంటున్నారా.. అయితే లుక్కేయండి...


చంద్రాలు అధికారంలో ఉండ‌గా సొంత కొంప‌ను క‌ట్టుకోలేద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.. అద్దె కొంప‌లో ఉంటూ కంపు రాజ‌కీయాలు చేస్తున్న చంద్రాలు చూసి ఏపీ జ‌నం ఇప్ప‌టికే ఈస‌డించుకుంటుంటే.. ఇప్పుడు బాబోరు చేస్తున్న ఈ నిర్వాకంతో ప‌రువు కాస్త బ‌జారున ప‌డే దుస్థితి దాపురించింది.. చంద్రాలు గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని ఆత్మ‌కూరు జాతీయ ర‌హ‌దారి వెంట అత్యాధునిక హంగుల‌తో టీడీపీ ఆఫీసు నిర్మిస్తున్నార‌ట‌.. అయితే ఈ ఆఫీసుకు తాను అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకున్న భూమి 99ఏండ్ల‌కు లీజుకు తీసుకున్నాడ‌ట‌.. 3ఎక‌రాల 65సెంట్ల భూమిలో రూ.50కోట్ల వ్య‌యం చేసే భూమిని కేవ‌లం ఏడాదికి ఎక‌రాకు వెయ్యి రూపాయ‌లు లీజు ఇస్తూ 2017లో చంద్రాలు జీవో అనుమ‌తులు ఇచ్చారు.


ఈ భూమి 1974లో అదే గ్రామానికి చెందిన బొమ్ము రామిరెడ్డికి 65సెంట్లు, కొల్లా ర‌ఘురాఘ‌వ‌రావుకు 1ఎక‌రం 75సెంట్లు, కొల్లా భాస్క‌ర్‌రావుకు 1ఎక‌రం 75సెంట్లు ప‌ట్టాలు ఇచ్చింది స‌ర్కారు. అయితే ఈ భూమిని లీజు పేరుతో తీసుకున్న భూమికి తోడు ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ పోరంబోకు భూమిని కూడా క‌లుపుకుని ఆఫీసు నిర్మిస్తున్నార‌ట‌.. ఎవ‌రైనా పేద‌లు ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేస్తే ఆగ‌మాగం చేసే అధికారులు నిమ్మ‌కు నీరేత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ప్ర‌భుత్వ భూమిని బాబోరు అండ్ బ్యాచ్ క‌బ్జా చేసి పారేసింది.. ఇక ఇందులో అత్యాధునిక హంగుల‌తో ఇంటీరియ‌ర్ డిజైన్లు చేయిస్తూ సింగాపూర్ మాడ‌ల్‌ను త‌ల‌పించేలా ప‌నులు కానిచ్చేస్తున్నార‌ట‌.


అయితే బాబోరుకు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డం అస‌లే చేత‌కాద‌న్న విషయం తెలిసిందే క‌దా.. అందుకే కేవ‌లం రెండు బేస్‌మెంట్లు.. మూడు అంత‌స్తుల‌కు అనుమ‌తు తీసుకుని మూడు బేస్‌మెంట్లు, ఐదు అంత‌స్తులు నిర్మిస్తున్నార‌ట‌.. అస‌లే అక్ర‌మ క‌బ్జా భూమి..అందులో అనుమ‌తుల ఉల్లంఘ‌న‌.. ఇంకేముంది.. బాబోరు ఆడిందే ఆట పాడిందే పాట‌.. అధికారులు తానాతందానా.. బాబోరు బ్యాచ్ ఒక‌టే భ‌జ‌న‌.. ఇలా సాగుతుంద‌ట‌.. టీడీపీ ఆఫీసు ప‌ని.. అందుకే ఇది అక్ర‌మ‌మ‌ని ఇప్ప‌టి స‌ర్కారు గుర్తించింద‌ట‌.. అయితే రెవెన్యూ అధికారులు భూక‌బ్జా జ‌రిగిన‌ట్లు తేలింది.. నోటీసులు పంపుతామ‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెపుతున్నారు.


భ‌వ‌నం అక్ర‌మ నిర్మాణం.. అక్ర‌మ స్థ‌లం.. అప్పుడేమి చేసారు రెవెన్యూ అధికారులు.. ఇప్పుడు ఈ అక్ర‌మ భ‌వ‌నం కూల్చుదామంటే.. బాబోరు నుంచి పెడ‌బొబ్బ‌లు.. ఆరుపులు.. భ‌జ‌న బ్యాచ్ సేమ్ టూ సేమ్‌.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారుకు ఇదో సంక‌టం.. ఏమీ చేయాలో పుర‌పాల‌క అధికారులు ఆలోచిస్తున్నారు.. జ‌నాలేమో.. అక్ర‌మం అయితే కూల్చండంటారు.. కానీ అందులో ఏదో ప‌చ్చ‌బ్యాచ్ వ‌చ్చి పుల్లేస్త‌ది.. ప్ర‌జ‌లు ఇటు తిరుగుతారు.. ఏమీ చేయాలో.. బాబోరు భాగోతం అక్ర‌మాలు.. చెప్పేది శ్రీ‌రంగ నీతులు.. ఇప్పుడెట్లా.. ఏపీ ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు.. ఏదైనా చ‌ట్టం తన ప‌ని తాను చేసుకుంటూ పోతుంది.. అందుకే టీడీపీ ఆఫీసు ఉంట‌దో ఊడుత‌దో.. కాల‌మే స‌మాధానం  చెపుతుంది... సో వెయిట్ అండ్ సీ...


మరింత సమాచారం తెలుసుకోండి: