భార్య భర్తల సంబంధానికి విలువ లేకుండా చేసింది ఓ భార్య. ప్రియుడి మోజులో పది ఏడడుగులు నడిచిన భర్తను విషం పెట్టి చంపాలనుకుంది ఓ భార్య. వివరాల్లోకి వెళ్తే.. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళా ఎలాగైనా తన భర్తను హత్య చేయాలనీ పక్క ప్లాన్ వేసింది. కానీ ఆ భర్తకు భూమ్మీద నూకలు ఉండటంతో కాల్ రికార్డు ద్వారా నిజం బయటపడి కటకటాల పాలైంది.     


గుంటూరు జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన మొహియుద్దీన్ అనే వ్యక్తితో రజియాబేగం అనే మహిళకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. అయితే మొహియుద్దీన్ స్నేహితుడు బాజీ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఆ సమయంలో రజియా బేగంకు బాజీతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి ధరి తీసింది.          


కాగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొహియుద్దీన్ పలు మార్లు ఆమెను హెచ్చరించాడు, అయినప్పటికీ ఆమె బుద్ధిలో ఎటువంటి మార్పు రాకపోగా, భర్తను హత్య చేయడానికి ప్రియుడుతో కలిసి పథకం పన్నింది. అన్నంలో విషం కలిపి తినిపించమని ప్రియుడు భాజీ ఇచ్చిన సూచనా మేరకు, మొహియుద్దీన్ తినే అన్నంలో విషం కలిపేందుకు సిద్ధమైంది.         


అయితే సరిగ్గా అదే సమయంలో రజియా బేగం మరియు బాజీల ఫోన్ సంబాషణకు సంబంధించి కాల్ రికార్డ్ బయటపడటంతో తన హత్యకు పథకం పన్నినట్లు మొహియుద్దీన్ తెలుసుకున్నడు. దీంతో అప్రమతమైన మొహియుద్దీన్ ముప్పాళ్ల  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.             


మరింత సమాచారం తెలుసుకోండి: