సమాజాన్ని మార్చాలంటే ఒక వెల్లువలా ప్రజా చైతన్యం పెల్లుబకాలి. నిస్వార్థ సేవకులు రాజకీయాల్లోకి రావాలి.  అంటూ ఆనాడు దివంగ‌త నేత‌ ఎన్టీఆర్ ప్ర‌జావాహినికి పిలుపునిచ్చారు.. నంద‌మూరి తార‌క‌రామా రావు ఇచ్చిన పిలుపుతో ఎంద‌రో నిస్వార్థప‌రులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వారంతా టీడీపీని అక్కున చేర్చుకున్నారు. తెలుగు దేశం పార్టీని బ‌తికించారు.. వారంతా టీడీపీని అధికారంలోకి తెచ్చారు.. ఆ పార్టీ నేత‌ల‌కు అధికారం క‌ట్ట‌బెట్టి, వారు మాత్రం ప‌ద‌వుల‌కు దూరంగా ఉన్నారు.. ఆనాడు ఎన్టీఆర్ మీదున్న స్వామి భ‌క్తి అలాంటిది... కానీ రోజులు మారాయి... ఎన్టీఆర్ అయితే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాజ‌కీయాలు చేసేవారు రాజ‌కీయాల్లోకి రావాల‌ని పిలుపునిచ్చారో కానీ.. కొంద‌రు స్వార్థ‌ప‌రులు కూడా టీడీపీలో చేరారు.


అందులో మొద‌టివ‌రుస‌లో ఉండేది ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబు నాయుడే అంటే న‌మ్మ‌గ‌ల‌రా... టీడీపీలో అస‌లు స్వార్థ‌ప‌రులు ఎవ్వ‌రైనా ఉన్నారా అంటే నెంబ‌ర్‌వ‌న్ స్థానం చంద్రాలుదే.. ఎన్టీఆర్ చంద్రాలుకు క‌న్న‌కూతురునిచ్చి పెండ్లి చేశాడు.. అలా ఎన్టీఆర్ ఓ స్వార్థ ప‌రుడిని తెచ్చుకున్నాడు. త‌రువాత వ‌రుస క్ర‌మం మన‌మంతా చూస్తున్న‌దే.. పిల్ల‌నిచ్చినందుకు  టీడీపీలో చేరిన చంద్రాలు త‌రువాత మామ‌కు వెన్నుపోటు పొడిచి, అధికారం హ‌స్త‌గ‌తం చేసుకుని, చివ‌రికి ఎన్టీఆర్ మాన‌సిక క్ష‌భ‌తో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.. అంటే చంద్రాలు అధికారం కోసం అద‌ను చూసి కోర‌లు చాపి కాటువేసే ఓ విష‌నాగు లాంటి వాడ‌నేది స్ప‌ష్టం అవుతుంది.


అలాంటి చంద్రాలు ఇప్పుడు తెల్లారి లేసిన దగ్గ‌ర నుంచి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌పం చేయ‌కుండా పార్టీని న‌డుప‌లేక పోతున్నారు. చంద్ర‌బాబు విజ‌న్ అంటారు.. కానీ పార్టీలో చంద్రాలు విజ‌న్ ఏదీ మ‌రి.. ఇప్ప‌టికి ఎన్టీఆర్ నామ‌స్మ‌ర‌ణ‌తోనే పార్టీని న‌డుపుతున్నారు. తెలుగువాడి ఆత్మ‌గౌర‌వం అని నిన‌దించిన ఎన్టీఆర్‌ను చావుదెబ్బ తీసి తెలుగువాడి న‌మ్మ‌క‌ద్రోహాన్ని రుచిచూపాడు చంద్రాలు.. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు టీడీపీని బ‌తికించుకునేందుకు చ‌నిపోయిన ఎన్టీఆర్‌ను ఎంత‌లా వాడుకుంటున్నారంటే.. ఆయ‌న పెట్టినప్పుడు జ‌నాల్లోకి వెళ్ళి ఇచ్చిన ప్ర‌సంగాల్లో జ‌నాల‌ను ఆక‌ట్టుకున్న ప‌దాల‌ను కొటేష‌న్లుగా ఇప్పుడు వాడుకుంటూ జ‌నాల‌ను మ‌భ్య‌పెడుతున్నారు. జ‌నాల‌ను రెచ్చ‌గొడుతున్నారు.


ఈరోజు టీడీపీ సోష‌ల్ మీడియా ఖాతాలో ఎన్టీఆర్ ఆనాడు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన కొటేష‌న్‌ను పోస్టు చేశారు.. సమాజాన్ని మార్చాలంటే ఒక వెల్లువలా ప్రజా చైతన్యం పెల్లుబకాలి. నిస్వార్థ సేవకులు రాజకీయాల్లోకి రావాలి అనేది ఎన్టీఆర్ ఆనాడు బ‌హిరంగ స‌భ‌లో ఇచ్చిన పిలుపే.. అంటే.. టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ ఫోటోల‌కు దండ‌లు వేయ‌డం.. ముందు నుంచి దండం పెట్టడం.. వెనుక నుంచి ఆయ‌న ఆశ‌యాల‌కు తూట్లు పొడ‌వడం.. ఆయ‌న ప్ర‌సంగాల‌ను కొటేష‌న్లుగా వాడుకోవ‌డం.. వెనుక  నుంచి స్వార్థ‌ప‌రుల‌తోనే ప‌నులు చేసుకోవ‌డం.. ఇంకా ఎంత‌కాలం ఇలా ఎన్టీఆర్ నామం  జ‌పం చేస్తూ కాలం గ‌డుపుతారో చంద్రాలు, ఆయ‌న కోట‌రి.


ఎన్టీఆర్ దివంగ‌తులు అయినా కూడా  ద్రోహానికి మారుపేరైన చంద్రాల‌ను ఇంకా కాపాడుతూనే ఉన్నారు..  ఏదేమైనా మునిగిపోయే నావ‌కు తెడ్డు అవ‌స‌రమా.. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ‌ను పెట్టుకున్నా... ఆయ‌న ప్ర‌సంగాల‌ను కొటేష‌న్లుగా ప్ర‌చారం చేసుకున్నా... జ‌నాలు ఇప్పుడు న‌మ్మే స్థితిలో లేరు.. అందుకేనేమో.. చంద్రాలు ప్రిస్టెష‌న్‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అంద‌రిని బండ‌బూతులు తిడుతున్నాడు.. నాశ‌నం అయ్యే స‌మ‌యం అస‌న్న‌మైతే.. ఎవ్వ‌రు ఆపినా ఆగ‌దు.. ఇప్పుడు చంద్రాల‌కు వ్య‌వ‌హారం చూస్తే అలాగే ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: