కట్టుకున్న భార్య తన తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో  భార్యను తండ్రిని చంపి తన జీవితాన్ని చేజేతులారా జైలుపాలు చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ అక్రమ సంబంధం మూలాన ఇద్దరు ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది.కోడలంటే కూతురితో సమానమనే విషయాన్ని మరచి, ఒంట్లో రగిలే కామానికి లోబడి వావి వరుసలు మరిచిన ఆ మామ, ఇక కట్టుకున్న భర్తను చేతకానివాడిలా భావించిన ఈ మహిళ మామ కోడళ్ల బందానికే కళంకం తెచ్చారు. దానివల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయి పరువును మంటకలిపేసుకున్నారు. సమాజం పెట్టిన కట్టుబాట్లను గాలికి వొదిలేసారు. ఫలితంగా శిక్షను అనుభవించారు.


కన్న వాడిచేతిలో తండ్రి, కట్టుకున్న వాడిచేతిలో భార్య ప్రాణాలను పోగొట్టుకున్నారు.ఇక ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే కర్ణాటకలోని విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామంలో పుట్టప్ప అనే వ్యక్తి భార్య రేణిక(35), తండ్రి మాళప్పతో కలిసి ఉంటున్నాడు. వ్యవసాయ పనులు నిమిత్తం పుట్టప్ప రోజూ ఉదయం పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఇద్దరే ఉండటంతో రేణుక, మాళప్ప మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. శనివారం రోజు అనుకోకుండ మధ్యాహ్నమే ఇంటికి వచ్చిన పుట్టప్ప గదిలో తన భార్య, కన్న తండ్రితో అసభ్యరీతిలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.


ఆ దృష్యాన్ని చూసి కోపంతో రగిలిపోయి కత్తితో వారిద్దిరపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో రేణుక, మాళప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పుట్టప్ప అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జంట హత్యలపై ఇండి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఓ క్షణం తన కోరికను అదుపులో పెట్టుకుని, కోడలిని మందలించి వుంటే బుద్ది చెడిన కోడలు సరైన మార్గంలోకి వచ్చేదేమో. కొడుకు హంతకుడిగా మారేవాడు కాదేమో. కాని నీతి తప్పిన ఇలాంటి  ప్రవర్తనల వల్ల చివరకు జరిగే దారుణాలు ఇలాగే వుంటాయి. అందుకే సమాజంలోని కట్టు బాట్లను పెట్టింది అందుకే అని ఈ ఘటనతో నిరూపించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: