రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు ఎవ్వ‌రు ఉండ‌రంటారు.. అయితే రాజ‌కీయాల్లో న‌మ్మిన‌బంటులు మాత్రం ఉంటార‌ని.. వారు ఏ పని అయినా న‌మ్మ‌కంగా శ‌త్రువు కూడా ప‌సిగ‌ట్ట‌లేనంత నిబద్ద‌త‌తో ప‌నిచేస్తార‌ట‌.. అందుకే మ‌న బ‌లం క‌న్నా శ‌త్రు శిభిరం బ‌ల‌హీన‌త‌లు తెలుసుకునేందుకు మ‌న గూడాచారులు శ‌త్రు శిభిరంలో ఉండాలంటారు రాజకీయ వ్యూహ‌క‌ర్త‌లు.. అయితే ఇక్క‌డ ఆయ‌న సంధించిన అస్త్రం శ‌త్రువు శిభిరాన్ని చిన్నాభిన్నం చేసిందా...?  తాను ప‌న్నిన రాజ‌కీయ వ్యూహంలో శ‌త్రు శిభిరం నామ‌రూపాల్లేకుండా పోయిందా..?  ఆయ‌న పంపిన మిస్సైల్ త‌న ప‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని తిరిగి త‌ను ఎక్క‌డి నుంచి ప్ర‌యోగించ‌బ‌డిందో అక్క‌డికే చేరిందా... ఆయ‌న వ‌దిలిన అస్త్రం ఎంత బ‌లంగా ప‌నిచేసిందో ఎంత బలంగా ప‌నిచేసిందో  చూస్తే రాజ‌కీయ నాయ‌కుల‌కు క‌ళ్ళు బైర్లు క‌మ్మాల్సిందే.. అస‌లు అస్త్రం ఎవ‌రిది.. ఎవ‌రు పంపారు.. ఎక్క‌డికి చేరింది.. ఎక్క‌డొచ్చి వాలిందో చూద్దాం...


రాజ‌కీయాల్లో బ‌లహీన‌మైన మిత్రుడి  క‌న్నా బ‌ల‌మైన శ‌త్రువుతోనే మేలు అనేది లోకోక్తి.. అయితే ఇక్క‌డ ఓ బ‌లమైన శ‌త్రువును నాశ‌నం చేయాలంటే బ‌ల‌మైన మిత్రువుల‌ను త‌యారు చేసుకోవాలి.. అంతే కాదు.. బ‌ల‌మైన శ‌త్రువు బ‌ల‌హీన‌త‌లు ఏమిటో తెలుసుకోవాలి.. అందుకు బ‌ల‌మైన అస్త్రాలు సంధించాలి.. సంధించిన అస్త్రాలు అంతే బ‌లంగా ప‌నిచేయాలి.. అందుకే అస్త్రాన్ని వదిలే నాయ‌కుడు ఓ బ‌ల‌మైన అస్త్రాన్నే సంధించారు.. ఆ అస్త్ర‌మే జూపూడి ప్ర‌భాక‌ర‌రావు.. ఆ ఆస్త్రాన్ని సంధించింది... ఏపీ సీఎం జ‌గ‌న్‌. జ‌గ‌న్ ఏంటీ.. జూపూడి ఏంటీ.. అస్త్రం ఏంది.. అనుకుంటున్నారా.. ఈరోజు ఏపీలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామ‌మే అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది..


మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర‌రావు టీడీపీ కి రాజీనామా చేసి త‌న సొంత‌గూడు వైసీపీలోకి చేరిపోయారు.. ఒక‌ప్ప‌టి త‌న బాస్ వైఎస్ జ‌గ‌న్‌తో ఆలింగ‌నం చేసుకుని మీరు అప్ప‌గించిన మిష‌న్ కంప్లీట్ చేసాను అనే గ‌ర్వంతో ఉప్పొంగిన తీరు ద‌ర్శ‌న‌మిస్తుంది. సీఎం జ‌గ‌న్ న‌వ్విన న‌వ్వు చూస్తే మ‌న లక్ష్యం నెర‌వేరింది.. మీరు అప్ప‌గించిన బాధ్య‌త ప‌క్కాగా చేసారు అనే న‌మ్మ‌కం క‌నిపిస్తుంది.. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక చూస్తుంటే.. టీడీపీని ఓడించేందుకు శ‌త్రు శిబిరంలో దూకిన అభిమ‌న్యుడుగా జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు క‌నిపిస్తున్నారు.. టీడీపీ బ‌ల‌హీన‌త‌ల‌ను తెలుసుకునేందుకు బాణం వ‌దిలిన శ్రీ‌కృష్ణుడిగా సీఎం జ‌గ‌న్ అనిపిస్తున్నారు.


ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉన్న జూపూడి ప్ర‌భాక‌ర్‌రావును దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేర‌దీశారు. ఆనాడు మాల‌మ‌హ‌నాడు నేత‌గా అవ‌తార‌మెత్తి.. ఎమ్మార్పీఎస్ నాయ‌కుడు న‌ల్లా సూర్య‌ప్ర‌కాశ్‌ను వెంటేసుకుని ఏపీలో మాల‌మాదిగలు సోద‌రులే.. వ‌ర్గీక‌ర‌ణ వ‌ద్దు.. క‌లిసి ఉండ‌ట‌మే ముద్దు అని రాష్ట్ర‌మంతా తిరిగిన నేత జూపూడి. అలా రాష్ట్ర‌మంతా మాల‌మహానాడు నేత‌గా ప‌రిచ‌యం అయిన జూపూడి త‌రువాత వైఎస్‌కు న‌మ్మిన‌బంటుగా మారారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి న‌మ్మిన‌బంటుగా, వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో క్రీయాశీల‌క పాత్ర పోషించారు.


2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున ఎమ్మెల్యేగా పోటీచేసిన జూపూడి ఓడిపోయారు. ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేయ‌డంతో చంద్రాలు ఎస్సీ కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా నియ‌మించారు. త‌రువాత జూపూడి జ‌గ‌న్‌ను త‌న‌దైన మార్క్‌శైలీలో దూషించారు. వైఎస్ జ‌గ‌న్‌ను దూషించ‌డంతో టీడీపీలో జోష్ పెరిగింది. జూపూడీ రాక‌తో టీడీపీకి వేయి ఎనుగుల బ‌లం వ‌చ్చింద‌ని టీడీపీ నేత చంద్రాలు సంతోషించారు. టీడీపీ బ‌లం మ‌రింత పెరిగింద‌ని సంబురాలు చేసుకున్నారు.. 2019 ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి.. టీడీపీ చావుదెబ్బ తిన్న‌ది.. చంద్రాలు అధికారం కోల్పోయాడు.. ప్ర‌తిప‌క్ష నేత‌గా మారారు.


ఇక జూపూడి త‌న‌దైన మార్క్‌శైలీలోనే వైసీపీ ప్ర‌భుత్వంపై కూడా దూష‌ణ కొనసాగించారు.. కానీ ద‌స‌రా పండుగ రోజున జ‌గ‌న‌న్న వ‌దిలిన మిస్సైల్ త‌న ల‌క్ష్యం నెర‌వేర్చుకుని తిరిగి సొంత గూటికి చేరింది.. ఆనాడు చ‌రిత్ర చెప్పిన‌ట్లు పాండ‌వ వ‌న‌మాసం... జ‌మ్మీ వృక్షం.. పాండ‌వులు విడిచిన బాణాలు, ఆయుధాలు... త‌రువాత శ‌త్రు సంహారం కోసం అదే ఆయుధాల‌ను తిరిగి పొంద‌డం.. శ‌త్రు నిర్మూల‌న త‌రువాత పాండ‌వుల ప‌ట్టాభిషేకం జ‌రుగ‌డం ఇలా జ‌రిగింది.. అచ్చు గుద్దిన‌ట్లుగా జ‌గ‌న్ వేసిన ఎత్తుగ‌డ టీడీపీ శిబిరంలోకి త‌న న‌మ్మిన‌బంటుగా ఉన్న జూపూడిని పంప‌డం జ‌రిగింది.


అక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను, శత్రువు బ‌ల‌హీన‌త‌లు, బ‌లాల‌ను తెలుసుకుని చావు దెబ్బ తీసారని,  త‌ద్వారా అధికారం వైసీపీకి ద‌క్కడం... ఇది శ‌త్రువు శిభిరంలో ఉన్న  జూపూడి ద్వారానే సాధ్య‌మైంద‌ని.. జ‌గ‌న్ ఇచ్చిన ప‌నిని తూచా త‌ప్ప‌కుండా పూర్తి చేసి తిరిగి త‌న బాస్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు ఇప్పుడు తేట‌తెల్ల‌మ‌వుతుంది... సో ఇది సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేతగానే ఇంత‌టి రాజ‌కీయ వ్యూహ‌ర‌చన చేసినాడంటే.. ఇక సీఎంగా ఇంకా ఎలాంటి రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు, చ‌తుర‌త చూపుతున్నాడో అర్థ‌మ‌వుతుంది.... సో ఏదేమైనా జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు తిరిగి న‌మ్మిన నేత జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి వాలిపోయారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: