సాధారణంగా కొన్ని థ్రిల్లర్ సినిమాల్లో చూపించినట్లు హంతకుడు వరుస హత్యలతో సైకోగా మారాడు..అతని ఉన్మాదానికి ఎంతో మంది బలైపోయారు..అన్న కథనాలు చూడటానికి ఆసక్తిగా ఉన్నా వాస్తవ రూపం దాల్చితే భయంకరంగా ఉంటుంది. రీసెంట్ గా బెల్లంకొండ
శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ సినిమాలో తాను అందవిహీనంగా ఉన్నాడని అమ్మాయిలు వెక్కిరిస్తే..ఆ అమ్మాయిలను దారుణంగా చంపే సైకోగా మారుతాడు ఆ కుర్రాడు. ఇక ఇలాంటి మూవీలో హాలీవుడ్ లో అయితే కోకొల్లలు.
తాజాగా కేరళాలో జరిగిన ఉదంగం అందరికీన విస్మయానికి గురి చేసింది. నలుగురితో నవ్వుతూ చలాకీగా మాట్లాడుతూ..చాలా అమాయకంగా కనిపించే ఓ ఇల్లాలు వరుసగా ఆరు హత్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె భయంకర పైశాచికత్వానికి సొంత భర్త .. రెండేళ్ల పాప కూడా ఉంది. కేరళలో సంచలనం రేపిన వరుస సైనేడ్ హత్యల నిందితురాలు జాలీ కేసును విచారిస్తున్న పోలీసులకు ఎన్నో షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. పద్నాలు సంవత్సరాల కాపురంలో 6 హత్యలు చేసింది. తినే ఆహారంలో సైనేడ్ కలిపి జాలీ ఆ ఆరుగురు కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకుందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఓ మామూలు గృహిణి ఇలా సైకోగా మారి ఒక సీరియల్ కిల్లర్ అని ప్రాథమిక ఆధారాలు తెలుపుతున్న ఈ కేసు చాలా సంక్లిష్టమైనది.
విచారణ సరైన కోణంలో కొనసాగాలంటే, మంచి సైకాలజిస్ట్ల సాయం తప్పనిసరి. ఆమె మానసిక స్థితి తెలుసుకోవడం అవసరం అని
కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో జాలీ కుమారుడు రెమో థామస్ తన తల్లి ఇంత దారుణాలని పాల్పడిందంటే అస్సలు నమ్మబుద్ది కావడం లేదని..ఇప్పటికీ తాను షాక్ లో ఉన్నానని అంటున్నాడు. ఇక ఆధారాలు అన్నీ జాలీని దోషి అని నిరూపిస్తున్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అంటున్నారు అధికారులు.