తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యగా మారిన విభజన అంశాల వ్యవహారం తీరా ఢిల్లీకి వెళ్ళింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు చర్చలు జరిగాయి. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్‌ 9,10 విభజన అంశాలు  కూడా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు తీసుకొనివచ్చారు.


ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల ప్రమోషన్లు ఎప్పుడూ జోన్ల ప్రకారం చేస్తారని తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనలు వినిపించింది. డీఎస్సీ స్థాయికి వెళ్తేనే కామన్‌ ప్రమోషన్ల కింద ఉంటుంది అని పైగా ఫ్రీ జోన్‌లో ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. కేటాయింపులు ప్రకారం ప్రమోషన్లు ఇస్తారంది. ఈ వాదనను హోంశాఖ అంగీకరించలేదు. ఫ్రీ జోన్‌ అనేది కొత్తగా వచ్చింది కాదని హోంశాఖ స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీనియార్టీని నిర్ధారించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో అంగీకరించిన హోంశాఖ.. ఆమేరకు సీనియార్టీని నిర్థారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చింది.


షెడ్యూల్‌ 9 ఆస్తుల విభజనపై హోంశాఖ సమావేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్‌ మొదట నుంచి పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇరువురి వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలుసుకున్నారు. అలాగే 68 సంస్థలకు సంబంధించి విభజనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించడం జరిగింది. ఈ జాబితాను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హోంశాఖ కార్యదర్శి..మీ స్పందన ఏంటో చెప్పాలని కోరారు.


ఇక షెడ్యూల్‌ 10 కి సంబంధించి శిక్షణా సంస్థల విభజన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోంశాఖ వివరణ ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హోంశాఖకు తెలియచేశారు. దీనిపై న్యాయసలహా తీసుకుని మళ్లీ అభిప్రాయం చెప్తామని హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. సింగరేణి కాలరీస్‌ విషయంలో విభజన చట్టంలోనే కొన్ని లోపాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖ దృష్టికి తెలిపింది. అలాగే షెడ్యూల్‌ 9, 10కు సంబంధించి ఆస్తుల విభజన ఒక నిర్ణీత కాలంలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరు రాష్ట్రాలకు స్పష్టంగా తెలియచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: