ఈమె శివ పూజ చేసి నైవేద్యం పెట్టనిదే..ఎంగిలి కూడా చేసేది కాదట. ఆ పరమ శివుడు కూడా ప్రతి రోజూ ఆమె పూజ కోసమే ఎదురుచూస్తూ ఉండేవాడట. ఇలా ఆమె శివుడితో చాలా దగ్గరగా ఉండేదని పురాణాల్లో చెప్పబడి ఉన్నది. కొండ కింద నుండి పైకి కుండలో నీటిని తెచ్చి అభిషేకం చేసేది. అలా ఒకరోజు కుండలో నీటిని పైకి తెచ్చి అక్కడ ఉంచి, మారేడు దళాల కోసం వెళ్ళింది. అదే సమయంలో అక్కడ నీటి కోసం వచ్చిన కాకి, నీరు తాగడానికి కుండపై వాలింది. ఈ ప్రక్రియల కుండ పడిపోయి దొర్లుకుంటూ పోవడంతో నీళ్లన్నీ పోయాయి. తిరిగి వచ్చిన ఆనందవల్లి ఆ దృశ్యాన్ని చూసి, కాకిపై తీవ్ర ఆగ్రహం కలిగింది.
తాను ఎంతో భక్తితో శివుడికి చేస్తున్న పూజకు భంగం కలిగించిన కారణంగా, ఇక ఈరోజు నుండి ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదంటూ కోపంతో శపించింది. శివుడికి మహా భక్తురాలు కావడంతో తాను కోరిన విధంగానే ఆ శాపం ఫలించింది. ఈ కారణం చేతనే కోటప్పకొండ పై మీరు చూద్దామనుకున్నా ఒక్క కాకి కూడా కనిపించదు. ఈ కథతో భక్తులు ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులకు ఒక చిత్రమైన అనుభూతిని కలిస్తుంది.