ప్రతి ఒక్కరూ జీవితంలో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటారు. కానీ నేటి తరంలో ఇవన్నీ సంపదలతో ముడిపడి ఉన్న విషయం తెలిసిందే. ఆర్థికంగా బాగుంటే అన్ని రకాలుగా ఇంట్లో బాగానే ఉంటుంది. దాదాపుగా అన్ని బంధాల మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేము. అయితే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా జీవితంలో చాలా విషయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే మనకి తగిన డబ్బు ఉండాలి. అయితే సిరి సంపదలకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మి కటాక్షం మనపై ఉంటేనే ఇది సాధ్యపడుతుంది.  

అంతే కాకుండా శ్రీ మహాలక్ష్మీ కటాక్షం మన కుటుంబంపై ఉన్నంత వరకు మన ఇంట్లో సుఖ సంతోషాలకు భోగ భాగ్యాలకు కొదువ ఉండదు. అలాంటి ఆ మహాలక్ష్మి చల్లని చూపు మనపై ఉండాలంటే ఈ రోజు శుక్రవారం ఇలా చేసి తీరాల్సిందే. శుక్రవారం ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి, ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మికి పూజ చేయాలి. పూల హారాలతో లక్ష్మీదేవి ప్రతిమకు అలంకరణ చేసి, దేవి పాదాల వద్ద ఒక రూపాయిని ఉంచి పూజ చేయాల్సి ఉంటుంది. పూజలో దీపారాధన కొరకు ఆవు నూనెను మాత్రమే వినియోగించడం మంచి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  

పూజ అనంతరం  రూపాయిని బీరువాలో కానీ, లేదా పూజ గదిలో ఒక గిన్నెను ఉంచి అందులో  వేయాలి. లేదా ఈ రూపాయిని ఎవరైనా డబ్బున్న వారికి దానం ఇవ్వాలి. తులసి కోటకు ప్రదక్షిణలు చేసి ప్రత్యేకంగా పూజించాలి. పూజ చివరగా హారతి ఇచ్చి పాట పాడడం శుభాన్ని కలిగిస్తుంది.  మరియు లక్ష్మి దేవికి సంబంధించిన శ్లోకాలను చదవడం వలన ఆ దేవి చాలా సంతోషపడుతుంది. పై విధంగా చేసి చూడండి మీకు అంతా మంచే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: