ఎవరైతే మనల్ని అదృష్టం అసలు వరించడం లేదు. ఎంత సంపాదించినా మన వద్ద డబ్బులు నిలబడడం లేదు అని బాధపడుతూ ఉంటారో, అలాగే
ఎంత సంపాదించినా నీళ్లలా ఖర్చు అయిపోతుందని, ఎంత ప్రయత్నించినా కలిసి రావడం లేదని చింతిస్తూ ఉంటారో అలాంటి వారు ఆ లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.  ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఆర్థికంగా మనం పైకి ఎదగలేము. అలాంటి వారు ప్రతి వారం శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేకమైన పూజలు చేసి ఆశీస్సులు పొందగలరు. అదే విధంగా ఒక గాజు గ్లాసులో రాళ్ల ఉప్పు ని తీసుకుని దానిపై అమ్మ వారికి పూజ చేసినటువంటి పసుపు కుంకుమ కొద్దిగా వేసి ఆ గాజు గ్లాస్ ను ఒక ప్లేట్ లో పెట్టి బీరువా కింద కానీ లేదా వెనుక భాగంలో కానీ ఉంచుకోవాలి.


ఇలా చేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఉప్పుతో ఉన్న ఈ గ్లాసు విషయం మన ఇంట్లో వారికి తప్ప మిగిలిన వారెవరికీ తెలియకూడదు. అదే విధంగా ఒక రాగి గిన్నెను కానీ లేదా వెండి గిన్నెను తీసుకొని అందులో మనం అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షింతలతో కూడిన కుంకుమను నింపాలి, అందులో పచ్చకర్పూరం వేసి దానిని మీరు బీరువాలో ఎక్కడైతే డబ్బులు, నగలు దాచుకుంటారో ఆ ప్లేస్ లో ఈ కుంకుమ, పచ్చ కర్పూరంతో ఉన్న గిన్నెను ఉంచాలి. ఇలా చేయడం వలన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చని మన పెద్దలు చెబుతున్న మాట.

కాబట్టి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుటకై ఇలా చేయడం ఉత్తమము. ఇలా చేయడం ద్వారా మహాలక్ష్మి చల్లని చూపు దీవెనలు మీ కుటుంబంపై ఉండి సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో నిండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: