అంటే ఎవరు లేకపోయినట్టైతే బ్రహ్మ సృష్టి, విష్ణువు స్థితి కరకం చేయడానికి, రుద్రుడు లయం చేయడానికి శక్తులు అవుతున్నారో అవన్నీ వాళ్ళు చేయలేరు. అందుకే శక్తీ తోడుగా ఉండటం అవసరం. ఆ శక్తిని పూజించాలంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలని అంటారు. అందుకే ఈ నవరాత్రులను శక్తీ ఆరాధన కాలంగా చెపుతారు. శరదృతువు, వసంతఋతువులు ఆరు నెలల తేడాతో వస్తాయి. అంటే ఈ కాలాన్ని యమద్రంస్టలుగా చెప్తారు. అంటే ఒక్కసారిగా వేడి, చలి; ఒక్కసారిగా చలి, వేడి గా వాతావరణం మారుతుంది. దానికి తగ్గట్టుగా శరీరం సిద్ధం కావాల్సి ఉంటుంది. వ్యక్తికి శారీరిక(సీజనల్ రోగాలు), మానసిక(చంచలం అయ్యే స్థితి), ఆత్మపరం(ఉద్ధరణకు చేయవలసిన సాధన)గా ఆర్యోగం అవసరం. కుటుంబ, సామజిక పరంగా కూడా వాతావరణం వలన అనేక శక్తీ ఆరాధన చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని చెప్పడమే నవరాత్రుల ఆరాధన.
ఈ ఆరాధన చేయడం వలన వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి మేలు జరుగుతుంది. అంటే మనిషి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే సమాజం సజావుగా నడుస్తుంది. అంటే ఎక్కడ జీవించాల్సిన అవసరం ఉందొ అక్కడ మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి, అతడి శారీరిక, మానసిక, ఆత్మపరంగా ఏవిధంగా వాటిని సాధించుకోవాలి అనేది ఈ నవరాత్రులలో శక్తీ ఆరాధన వలన చెప్పబడుతుంది. అందుకోసం అడ్డువచ్చే విషయాలు రాక్షసులు అనుకుంటే, వాటిని దాటటం అంటే రాక్షసులను చంపడం, తద్వారా విజయం సాధించడం. ఈ విశ్వములో అత్యున్నత ప్రాణి కేవలం మనిషి. అందుకే ఈ మనిషి సరిగ్గా ఉంటేనే ఇతర ప్రాణుల జీవనం ఆధారపడుతుంది. అందుకే అతడి శ్రేయస్సు కోసం ఈ దైవం, శక్తీ ఆరాధనలు ఆయా ధర్మాల ప్రకారం సాంప్రదాయంగా తీసుకువచ్చారు.