వైకుంఠ చతుర్దశి రోజును విష్ణువు, శివునికి అంకితం చేయడం వలన ఈరోజును ప్రత్యేకమైన, పవిత్రమైన దినంగా భావిస్తారు హిందువులు. హిందూ లూని సౌర క్యాలెండర్‌లోని కార్తీక మాసంలోని శుక్ల పక్షం (వృద్ధి చెందుతున్న చంద్రుడు పక్షం) 14వ చాంద్రమాన రోజున జరుపుకుంటారు. వారణాసి, రిషికేశ్, గయా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.

వైకుంఠ చతుర్దశి 2021 తేదీ, శుభ సమయం
వైకుంఠ చతుర్దశి బుధవారం, నవంబర్ 17, 2021
వైకుంఠ చతుర్దశి నవంబర్ 18 23:40 నుండి 00:33 వరకు, వ్యవధి00 గంటల 53 నిమిషాలు

దేవ దీపావళి గురువారం 18 నవంబర్ 2021
చతుర్దశి తిథి ప్రారంభం నవంబర్ 17, సాయంత్రం 18:50 నుంచి ఉదయం 09:50 నవంబర్ 18 వరకు

వైకుంఠ చతుర్దశి 2021: ప్రాముఖ్యత
శివ పురాణం వైకుంఠ చతుర్దశి కథను చెబుతుంది. ఒకసారి శివుడిని పూజించడానికి విష్ణువు వైకుంఠం నుండి వారణాసికి వచ్చాడు. శివునికి వెయ్యి కమలాలు సమర్పిస్తానని వాగ్దానం చేసి, కీర్తనలు పాడుతూ, తామరపూలను సమర్పించాడు. అయితే ఈ క్రమంలో విష్ణువు వెయ్యవ కమలం తప్పిపోయిందని గుర్తించాడు. దీంతో చేసేది లేక విష్ణువు కళ్లను కమలనాయన్ అని కూడా పిలుస్తారు కాబట్టి తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి తన కన్నును తీసి శివుడికి సమర్పించాడు. ఇలా చేయడం ద్వారా శివుడు సంతోషించాడు. విష్ణువు కన్నును తిరిగి ప్రసాదించడమే కాకుండా, ఆయనకు సుదర్శన చక్రం, పవిత్ర ఆయుధాలు బహుమతిగా ఇచ్చాడు.

మరో పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు తన జీవితకాలంలో అనేక నేరాలు చేశాడు. వైకుంఠ చతుర్దశి రోజున పాపాలు పోగొట్టుకోవడానికి గోదావరి నదిలో స్నానమాచరించాడు. ఇది రద్దీగా ఉండే రోజు ధనేశ్వరుడు జనంతో కలిసిపోయాడు. అయినప్పటికీ అతని మరణానంతరం యముడు అతనికి శిక్షను విధిస్తాడు. అయితే ధనేశ్వరుడు వైకుంఠ చతుర్దశి నాడు భక్తులచే తాకడం వాళ్ళ శివుడు జోక్యం చేసుకుని ధనేశ్వరుడికి వైకుంఠంలో స్థానం కల్పిస్తాడు. దీంతో ఆయన పాపాలు తొలగిపోతాయి.

వైకుంఠ చతుర్దశి ఆచారాలు, వేడుకలు
పండుగ రోజు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. రిషికేశ్‌లో దీపాలు వెలిగిస్తారు. ఈ సందర్భం చాతుర్మాసం తర్వాత విష్ణువు మేల్కొలుపును సూచిస్తుంది. పవిత్ర గంగా నదిపై పిండి లేదా మట్టి దీపాలతో చేసిన వేలాది చిన్న దీపాలను వెలిగిస్తారు. గంగా హారతి కూడా ఇస్తారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా విష్ణువుకు వెయ్యి కమలాలను సమర్పిస్తారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువుకు ప్రీతికరమైన తులసి ఆకులను శివునికి, శివునికి ప్రీతికరమైన బిల్వ ఆకులను విష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తారు. గంగాజలం, అక్షత, చందనం, పుష్పాలు, కర్పూరం మొదలైన వాటిని సమర్పిస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: