భారత క్రికెట్ లో  దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ తన కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా ధోని కెరీర్ విషయంలో ధోనీ భార్య సాక్షి అందించిన ప్రోత్సాహం మరువలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ ధోని ప్రొఫెషన్ ను  గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది సాక్షి. అయితే దాదాపు 2 నెలలకు పైగా నే ఐపీఎల్ నేపథ్యంలో యూఏఈలో ఎంతగానో బిజీబిజీగా గడిపిన మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలే తన భార్య పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ చేరుకున్నాడు. ఇక తన భార్య పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు ధోని.



 కొంతమంది స్నేహితులు బంధువులు మధ్య దుబాయిలో ధోనీ భార్య సాక్షి పుట్టిన రోజు వేడుక  జరిగింది. కాగా ఇటీవలే ధోనీ భార్య సాక్షి బర్త్ డే  సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కాగా ధోనీ భార్య సాక్షి బర్త్ డే వేడుకల్లో పాకిస్తాన్  క్రికెటర్ షోయబ్ మాలిక్  మాలిక్ సానియా మీర్జా దంపతులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక వీరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా షోయబ్ మాలిక్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య మైదానంలో వైరం  ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 కానీ మైదానం వెలుపల మాత్రం ధోని, మాలిక్ మంచి స్నేహితులు అనే విషయం చాలా మంది అభిమానులకు తెలుసు. అంతేకాదు షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధోనితో ఉన్న స్నేహం కారణంగానే షోయబ్ మాలిక్ ధోనీ భార్య సాక్షి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నట్లు  తెలుస్తోంది. ఇటీవలే ధోనీ భార్య సాక్షి పుట్టినరోజు వేడుకల్లో షోయబ్ మాలిక్ సానియా మీర్జా కలిసి పాల్గొన్న ఫోటోలను సానియా మీర్జా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: