అయితే గత కొంత కాలం నుంచి శిఖర్ ధావన్ సరైన ఫామ్ లో లేకపోవడం తో అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శిఖర్ ధావన్ కి గాయం కావడంతో ఇక ఆ గాయం నుంచి కోలుకున్నప్పటికీ మరోసారి ఫామ్ లోకి రాలేకపోయాడు. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోగా ఇక ఇటీవల ఇంగ్లాండ్ టీమిండియా మధ్య సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా జట్టులో స్థానం సంపాదించుకున్న శిఖర్ ధావన్ అద్భుత ప్రదర్శన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
శిఖర్ ధావన్ ను ఇబ్బంది పెట్టి వికెట్ తీసుకునేందుకు అటు ఇంగ్లాండ్ బౌలర్లు ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి బంతి విసిరిన దానికి దీటైన సమాధానం చెబుతూ పరుగుల వరద పారించాడు. అయితే శిఖర్ ధావన్ దూకుడు చూస్తే ఇక సెంచరీ చేయడం పక్క అని అనుకున్నారు. ఇక 98 పరుగులు వరకు చేశాడు. ఇక మరో రెండు పరుగులు చేస్తే ధావన్ సెంచరీ పూర్తి చేస్తాడు అని అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ధావన్ చివరికి అవుట్ అయి పెవిలియన్ చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టోక్స్ బౌలింగ్లో ఇయాన్ మోర్గాన్ కి క్యాచ్ ఇచ్చి ఇక మైదానం నుంచి వెనుదిరిగాడు శిఖర్ ధావన్. మరో రెండు పరుగులు చేసి ఉంటే గబ్బర్ సెంచరీ పూర్తి చేసేవాడు అని అభిమానులు భావిస్తున్నారు.